స్వైన్ ఫ్లూ వ్యాధికి విరుగుడు తిప్పతీగ…!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకుగాను తిప్పతీగను ప్రతి రోజు వాడొచ్చని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.
ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయుర్వేదం ద్వారా ప్రయత్నించవచ్చని, ఇందులో భాగంగా తిప్పతీగను ప్రతి రోజు సేవించడం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుందని ఆయన న్యూ ఢిల్లీలో తెలిపారు.
తిప్పతీగ రసాన్నిగాని లేదా కాండాన్నిగాని తులసి రసంతో కలిపి సేవించాలి. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఈ వ్యాధిబారిన పడి అల్లోపతి మందులు ఇదివరకే వాడుతుంటే వీటితోపాటు తిప్పతీగను వాడొచ్చని ఆయన పేర్కొన్నారు.
అందుబాటులో ఔషదం అల్లం
అందుబాటులో ఔషదం అల్లం
అల్లంలో మనకు తెలియని ఔషధీయ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది. కొందరు అల్లాన్ని అన్నింటిలో వాడితే మరి కొంత మంది మాత్రం అల్లాన్ని చూస్తే ఆమడ దూరంలో ఉంటారు. అటువంటి వారు తెలుసుకోవలసింది ఏమిటంటే అల్లానికీ మన ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నది. అల్లాన్ని దూరం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నట్టే.
గాస్ట్రో ఇంటెస్టినల్ డిస్ట్రెస్ అంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులన్నిటికీ అల్లం రామ బాణంలా పనిచేస్తుంది.గర్భిణీ స్ర్తీలలో రెండవ నెల ఆరంభంతోనే వాంతులు అవడం, తలతిరుగుడు, నడుం బాధలు లాంటివి వస్తుంటాయి.అరుగుదల లేకపోవడం వంటి వాటిని మార్నింగ్ సిక్నెస్ అంటారు. దీనిని అల్లం బాగా తగ్గిస్తుంది. మోషన్ సిక్నెస్, సీసిక్నెస్లను తగ్గిస్తుంది. కడుపులో వాయువును అల్లం హరించి వేస్తుంది. జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్తక్రారులు అల్లాన్ని ఉపయోగించారు.
- గుండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. కేన్సర్ ట్యూమర్స్ పెరగనీయదు.
- మైగ్రేన్ తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది.
- అల్లం పెయిన్ కిల్లర్. అలానే మంట ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది.
- కఫం, దగ్గుకు అల్లం తేనె కలిపి ఇచ్చిన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. నూతనోత్సహం వస్తుంది.
- అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇసుక కుండీలో గానీ, పెరటిలో గానీ పాతిపెడితే చాలా కాలం నిల్వ ఉంటుంది.
- కాల్చిన అల్లాన్ని శొంఠి అంటారు. శొంఠిని పొడిగా చేసి అర స్పూన్ పొడి, ఆర స్పూన్ పంచదార కలుపుకొని పరకడుపున తీసుకోవాలి. లేదా మొదటి ముద్దలో శొంటిపొడిని తీసుకుంటే తిన్నది జీర్ణం బాగా అవుతుంది.
- రక్త క్యాన్సర్ను నిరోధించ డంలో బాగా పని చేస్తుంది. కనుక అల్లాన్ని ఆహారంలో వాడడం ఎంతో మంచిది. అల్లం టీ త్రాగడం, రోజు ఉదయం ఓ చిన్న అల్లం ముక్క నమిలి తినడం ద్వారా అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
- అందుకే పూర్వకాలం వంటిళ్ళల్లో అల్లం తప్పనిసరిగా కనిపించేది. అల్లాన్ని నిమ్మరసంలో ఊరబెట్టి అజీర్ణం అనిపించినప్పుడు తింటుంటే ఆ మందం తగ్గుతుంది. అల్లం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.
- surya telugu
ఒత్తిడికి ఖర్చులేని మందు ప్రాణాయామం
ఒత్తిడికి ఖర్చులేని మందు ప్రాణాయామం
ఆధునిక జీవన శైలి కారణంగా తరుచు అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం వల్ల అరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతోగానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాసనాలను, ప్రాణాయామాన్ని చేయడం వల్ల శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.
ప్రాణాయామ విశేషాలు…
ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమం టే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, నిశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అం టారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబ ద్ధ్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూ డా అదుపులో ఉంచవచ్చు.
నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటిలో ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాయామం వల్ల వాట న్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణా యామేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరో గాలు హరించిపోతాయి అనే సూత్రం ప్రచారం అయింది. ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమ నే 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృద యం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థా నం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థా నం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పచన క్రియకు సమానం, కంఠ శక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి.శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటా రు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.
మెడికల్ సైన్స్ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్ర యోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్ర కారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొ ద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని వారు సూ ర్యనాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడ మ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదిం చుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూ ర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూ ర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయా మ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబం ధించినదే.
ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు…
- ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
- శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
- రక్త శుద్ధి జరిగి అందులోని చెడు అంతా బయటికి వెళ్లిపోతుంది.
- గుండెకు సత్తువ లభిస్తుంది.
- మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
- జఠరాగ్ని పెరుగుతుంది.
- శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
- ఆయుష్షు పెరుగుతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు…
- మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచిఉన్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదైనా ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
- గాలి విపరీతంగా వీస్తూంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
- మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
- సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
- పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
- ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
- ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
- పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
- నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి.
- ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
- ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
- ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
- surya telugu
పొట్ట తిప్పులు
పొట్ట తిప్పులు
బొజ్జలు పలురకాలు. వాటితో వచ్చే అవస్థలు పలు విధాలు. ఊబకాయం ఉండటం వల్ల కూర్చోవడానికి కుర్చి సరిపోదు, బట్టలు అసలే పట్టవు,పరిగెత్తడం మహా కష్టం, నిలుచుంటే ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపిస్తుంటుంది. అయితే బొజ్జ తగ్గదు.. దాని వల్ల వచ్చే బరువు తగ్గదు. పెరుగుతున్న పొట్టను ఫ్లాట్గా ఎలా చేయాలి? అలా పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలన్న అంశాలపై అవగాహన అవసరం.
పొట్ట ఎలా పెరుగుతుంది…
పొట్ట ఊబకాయానికి ముఖ్యమైన సూచిక. అందుకు ఎంత తింటాం? ఎంత ఖర్చువుతుం ది? ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అనే విషయం చూసుకోవాలి. తినడం ఎక్కువై, క్యా లరీల ఖర్చు తక్కువ అయితే కొవ్వు పెరిగి పొట్ట ముందుకు చొచ్చుకు వస్తుంది. అది వా రిలో బిఎమ్ఆర్ అంటే ‘బేసల్ మెటబాలిక్ రేట్’ లెవల్ని బట్టి ఉంటుంది.
జంక్ఫుడ్ వల్ల పొట్ట తిప్పలు…
ఒక మనిషికి రోజులో 1000 నుంచి 1400ల కేలరీల ఆహారం సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా తీసుకొన్న ఆహారం కొవ్వు రూపంలో తయారయ్యే అవకాశం ఉంది. తిండి మానేస్తే బరువు తగ్గుతారేమో గాని, లావు మాత్రము తగ్గరు. అందుకని తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసు కోవడం, నిత్యం వ్యాయామం చేయ్యడం, నియమబద్ధ జీవితాన్ని గడపడం వల్ల పొట్ట పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం భుజించే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. చిప్స్, పాప్కార్న్, కుకీస్, కేక్స్ మొదలైన జంక్ ఫుడ్ని అస్సలు తినకూడదు.
ఊబకాయం వల్ల మనకు వచ్చే రోగాలు…
మన శరీరంలో కొవ్వు సులభంగా చేరిపోతుంది. దీని వల్ల బరువు పెరగడం కాని శరీరంలోని ఇతర అవయవాలు పెరగవు, కాని కొవ్వు వల్ల అధిక రక్త పో టు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపొథైరాయిడ్ ప్రాబ్లమ్, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అధిక నిద్ర, క్యాన్సర్లు, కొందరిలో వంధ్యత్వం, రుతు స్రా వంలో తేడాలులాంటి సమస్యలు రావచ్చు. కొందరిలో సమస్యలు మరింత తీవ్రంగా రావచ్చు. ఇలా మన శరీరానికి ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు…
పొట్ట రాకుండా రోజువారీగా తప్పరి సరిగా డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
- కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.
- సహజంగా లభించే గ్రీన్ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు, కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
- వైట్ పాస్తా, బ్రెడ్, బంగాళ దుంపలు తినకూడదు. గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్ను తీసుకోవచ్చు.
- అన్ని రకాల ఆకు కూరలు తీసుకోవచ్చు. అయితే క్యారెట్ను మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి.
- రాత్రి ఏడు దాటితే తినడం మానివేయాలి.
- తక్కువగా ఫ్యాట్ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
బరువు సూచిక… - బి.ఎమ్.ఐ. అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఎదుగుతున్న కొద్దీ అలాగే ఎత్తుకు తగ్గ బరువుండాలి.
- బరువు/ఎత్తు – బి.ఎమ్.ఐని బెట్టి కొలవచ్చు.
- సాధారణంగా మన దేశంలో 18-20 బి.ఎమ్.ఐ. ఉండటం మంచిది.
- అధిక బరువు – బి.ఎమ్.ఐ. 25 కిలో గ్రాములు / ఎమ్ 2 కంటే ఎక్కువ.
- ఊబకాయం – బి.ఎమ్.ఐ. 30 నుంచి 34.9 కిలో గ్రాములు / ఎమ్ 2 వరకు.
- అధిక ఊబకాయం – బి.ఎమ్.ఐ. 35-39.9 కిలో గ్రాములు / ఎమ్ 2, బి.ఎమ్.ఐ. 40 కిలో గ్రాములు / ఎమ్ 2 అంతకంటే ఎక్కువ.
ఊబకాయానికి చికిత్సామార్గాలు…
- ల్యాప్రోస్కోపిక్ వంటి నూతన విధానాలు స్థూలకాయ శస్త్ర చికిత్సను సులభం చేశాయి. దీని వల్ల తినగల్గిన పరిమాణాన్ని నియంత్రించి అధిక కేలరీల చేరికను అరికట్టవచ్చు. ఉదరకోశాన్ని కుంచింపజేయడం స్లీవ్గ్రాసెక్టమీ ద్వారా చేయవచ్చు. అలాగే గ్యాస్ర్తిక్ బ్యాండ్ ద్వారా కొద్దిగా ఆహారం తీసుకొన్నా త్వరగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. పొట్ట భాగంలో చేరిన అధిక కొవ్వును లైపోసెక్షన్ పద్ధతి ద్వారా తీసివేయవచ్చు. అయితే ఈ చికిత్స తరువాత మళ్లీ బరువు పెరగకుండా నిత్యం వ్యాయామాలు చేయాల్సి ఉంటంది. బేరియాట్రిక్ చికిత్స అనేది కూడా ఉంది. అయితే ఇలాంటి చికిత్సలని నిపుణులైన వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు వారి పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
– డా ఠాగూర్ మోహన్ గ్రంధి
Consultant Laproscopic Bariatric Surgeon,
Aware Global Hospitals,
L.B. Nagar, Hyderabad
Cell: 9000673344
surya telugu
స్టీవియాతో మధుమేహం దూరం
స్టీవియాతో మధుమేహం దూరం
మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినేందుకు వెనుకాడుతుంటారు. కాని తీపి పదార్థాలను తిన్న తర్వాత మధుపత్రిని నమిలితే శరీరంలో చక్కెర శాతం అదుపులో వుంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. మన దేశంలోనే కాదు ఇప్పుడు విదేశాల్లోనూ స్టీవియా మొక్కలను పెంచుతున్నారు…అచ్చ తెలు గులో దీనిని మధుపత్రం అని అంటారు.
చెరకు కన్నా తీపి…
మధుపత్రి ఆకుల్లో చెరకు కన్నా మూడింతల తీపు వుంటుంది. భోజనం చేసే ఇరవై నిమిషాల ముందు మధుపత్రి (స్టీవియా) ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోను పెంచుకోవచ్చు. మధుపత్రి ఇన్సులిన్ను విడుదల చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మధుప త్రి సేవిస్తుంటే మధుమేహ వ్యాధితోపాటు రక్తపోటు, హైపర్ టెన్షన్, దంతాలు, గ్యాస్, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
స్వీట్ స్టీవియా ఇది అత్యంత తియ్యదనం కలిగిన ఔషదీయ మొక్క. కేవలం దీని పచ్చి ఆకులను తమలపాకుల్లా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే చాలు నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు క్రమేణా దూరమవుతాయి. అంతేకాదు నోటి దుర్వాసన పోగొట్టే మౌత్ ఫ్రెష్నర్గా కూడా దీనిని ఉపయోగించ వచ్చు. మామూలుగా పంచదార తింటే అనేక వ్యాధులు వస్తాయి. కానీ స్టీవియాతో తయారైన పంచదార తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కలిగించకపోగా… మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిర్భయంగా దీనిని తీసుకోవచ్చు.
ఆరోగ్య సంజీవని…
స్టీవియాను తీసుకుంటే మన శరీరంలో ఎటువంటి అదనపు క్యాలరీలు చేరవు. దీంతో రక్తంలోని గ్లూకోజ్లో ఏరకమైన మార్పు ఉండక… పెరిగిన నిల్వలను తగ్గించి గ్లూకోజ్ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో స్టీవియా అమోఘంగా పనిచేస్తుంది. ఇది కేవలం డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకే కాక… అధిక రక్తపోటును తగ్గించడంలో, అంతకంతకూ పెరిగిపోతున్న ఊబకా యాన్ని స్థిరీకరించడంలో, దంత వ్యాధుల నివారణలో సంజీవినిలా పనిచేస్తుందని శాస్ర్తీయ పరిశోధనలలో తేలింది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో… అత్యంత వేగవంతం గాను… సమర్థవంతంగాను పనిచేస్తాయని తేలింది.
ఎక్కడ పుట్టింది?
ఇన్ని సుగుణాలు ఉన్న ఈ మొక్క ఎక్కడ పుట్టిందో తెలుసా… ఇది పెరుగ్వే దేశంలో ఎక్కువగా కాలువల పక్కన, కొలనుల వద్ద విచ్చలవిడిగా పెరిగేది. దీనిని ఆ ప్రాంతం వారు కొన్ని శతాబా ్దలుగా ఔషధ విలువలు కలిగిన మొక్కగా గుర్తించి విరివిగా వాడుతుండేవారు. ఆ ప్రాంతంలో ఉండే ఆదివాిసీలుగా పిలువబడే గ్వారాని ఇండియన్లు దీనిని ‘క్వాహీహీ అని పిలిచేవారట. క్వాహీహీ అంటే తీపి మొక్క అని అర్థం.
దేశ,దేశాలలో…
సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ మొక్కలలోని విశేష గుణాలను జపనీయులు గుర్తించారు.గుర్తించడమే గాక దీనిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అక్కడి నుండి చైనా, థాయ్లాండ్, మలేషియా, తైవాన్ వంటి దేశాలు వీటి సాగు మీద శ్రద్ధవహించాయి. ఇటీవలే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల గుర్తింపు వచ్చింది.
suryatelugu
హృద్రోగాలు – చికిత్స
హృద్రోగాలు – చికిత్స
ఆధునిక కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా వ్యక్తులు గుండెపోటుకు గురవుతున్నారు. ఇందుకు ఒక కారణం మన జీవనశైలిలో ఉన్న లోపాలు కాగా మరికొన్ని వంశపారంపర్యమైనవి, మరికొన్ని ఇతరత్రా కారణాల వల్ల వచ్చేవి అయి ఉంటున్నాయి. శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే గుండెను కాపాడుకోవడం మన బాధ్యత. గుండె పోటు ఎందుకు వస్తుంది? దానికి చికిత్స ఏమిటి? నివారణ ఎలా? అన్న విషయాలను వివరించే వ్యాసమిది..
నూతన చికిత్సా విధానాలు…
మన దేశంలో స్వతంత్రానికి ముందుఅంటే అరశతాబ్దం క్రితం సగటు ఆయుషు 36-37 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న శాస్ర్తీయ పరిజ్ఞానంతో అది 60 సంవత్సరాలు దాటింది. ఆయుష్షుతో పాటుగానే జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా మెండుగా పెరిగాయి. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, అధికరక్తపోటు, స్థూలకాయం మొదలైనవి కావచ్చు లేదా ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి, అధిక కొవ్వుతో కూడుకున్న ఆహారం వల్ల కావచ్చు.గత కొన్ని దశాబ్దాలలో వైద్యరంగంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. వస్తున్నా యి. మన దేశంలో 1970-80వ దశకంలో గుండెపోటు వస్తే మందులు మాత్రమే మార్గం గా ఉండేది. ఎవరికైనా బైపాస్ అవసరమైతే ఎక్కడో అమెరికాలోనో మరో అభివృద్ధి చెందిన దేశంలో మాత్రమే అందుబాటులో ఉండేది. అదీ ఎందరికి సాధ్యమయ్యేదో ఊహించవచ్చు. గడిచిన 20-25 సంవత్సరాల్లో మనం ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పవచ్చు.
1977లో ఆండ్రూ గ్రండ్జ్విగ్ అనే జర్మన్ శాస్తవ్రేత్త బైపాస్ ఆపరేషన్కు ప్రత్యామ్నాయంగా మరో శాస్ర్తీయ మార్గముందని ప్రపంచానికి చాటి చెప్పాడు. అది మన దేశంలో తొలిసా రిగా 1985లో చేశారు. శాస్ర్తీయ పరిజ్ఞాన మార్పిడి మనకు అన్వయించుకునేందుకుసమయం పడుతూ ఉండేది. ఇప్పుడు కాలం మారుతున్న తరుణంలో శాస్ర్తీయ పరిజ్ఞానం అందుబాటు కొన్ని రోజులు లేదా కొన్ని గంటల తేడా బదిలీ అవుతున్నది. ఈ సరికొత్త విధానాలలో ముఖ్యంగా హృద్రోగులకు అందుబాటులోకి వచ్చిన విధానం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే సూక్ష్మనాళం ద్వారా వైద్య ప్రక్రియలు.
గుండెలోగల లోపాన్ని సూక్ష్మనాళం ద్వారా గుర్తించి సరిచేయడం, రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం, మూసుకుపోయిన కవాటాలు వెడల్పు చేయడం, పుట్టకతో వచ్చిన లోపాలను సరి చేయడం వంటివి చేయవచ్చు.గుండెపోటు రావటానికి గల కారణాన్ని ఆంజియోగ్రామ్ అనే పరీక్ష ద్వారా గుర్తించి వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయించవచ్చు. దీనికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు…ఇందులో ఉన్న వివిధ రకాల చికిత్సలు ఇలా ఉంటాయి. 1. మెడికల్ మేనేజ్మెంట్ (మందుల ద్వారా చికిత్స) 2. బెలూన్ యాంజోప్లాస్టీ 3. బైపాస్ సర్జరీ.
బెలూన్ ఆంజియోప్లాస్టీ/ స్టెంట్స్…
సూక్ష్మనాళం ద్వారా మనకి అందుబాటులో ఉన్న ఆంజియోప్లాస్టీ చికిత్స ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది. లక్షలాది హృద్రోగులు ఈ మా ర్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పు డు బైపాస్కన్నా అధిక సంఖ్యలో ఈ చికిత్సలు జరుగుతున్నాయని అంచనా.
ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కెథెటర్) మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపడం జరుగుతుంది. తర్వాత సన్నటి తీగ (గైడ్ వైర్)ను రక్తనాళంలోకి చొప్పించడం, తద్వారా బెలూన్ను పంపడం జరుగుతుంది. రక్తనాళంలో ఉన్న కొవ్వును ఈ బెలూన్ ద్వారా తొలగించడం స్టెంట్ను అమర్చడం ద్వారా చికిత్స పూర్తి అవుతుంది.అడ్డంకి (బ్లాక్)ని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీనపడకుండా ఉంటాయి.
కెరోటిడ్ ఆంజియోప్లాస్టీ…
మెదడు ప్రధాన రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం చేయవచ్చు.
పెరిఫెరల్ ఆంజియోప్లాస్టీ…
కాళ్ళు చేతులకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
సెరిబ్రల్ ఆంజియోప్లాస్టీ…
మెదడుకు సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
రీనల్ ఆంజియోప్లాస్టీ…
మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
మైట్రన్ వాల్వులో ప్లాస్టీ…
గుండెకు ఎడమ పక్క ఉన్న మైట్రల్ కవాటం మూసుకుపోయినపుడు దాన్ని వాల్వులో ప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బెలూన్ సహాయంతో వెడల్పు చేయడం జరుగుతుంది.
పల్మొనరీ వాల్వులోప్లాస్టీ…
గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే దమనికి ఉన్న కవాటం (పల్మొనరీ వాల్వ్) మూసుకుపోయినపుడు బెలూన్ ద్వారా తెరవవచ్చు. ఈలోపం సాధారణంగా పుట్టుకతో వచ్చేది కాబట్టి చిన్న వయస్సులో కూడా సరిచేయవచ్చు.
పిబిఎవి.. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్ళే ధమనికి (అయోర్టా) ఉన్న కవాటం (అయోర్టిక్ వాల్వ్) పుట్టుకతోగాని లేదా కొన్ని కారణాల వల్ల మూసుకుపోవచ్చు. వీటిని ఆపరేషన్ లేకుండా సరిచేయవచ్చు.
పిబిటివి.. పుట్టుకతోగాని లేదా కొన్ని కారణాల వల్ల గుండెకు కుడి పక్కన ఉన్న ట్రైకస్పిడ్ కవాటం మూసుకుపోతే వీటిని ఆపరేషన్ లేకుండా సరిచేయవచ్చు. ఈ కవాటం మూసుకుపోయినప్పుడు బెలైన్ సహాయంతో తెరవవచ్చు.
ఐవిసి ఫిల్టర్స్… కాళ్ళలో ఉన్న సరిల్లో కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకడుతూ ఉంటుంది (డీప్ వీన్ త్రాంబోసిస్). ఈ రక్తపు గడ్డలు విడిపోయినప్పుడు అవి ప్రాణాంతకం కావచ్చు. శ్వాసకోశ సంబంధమైన బాధలు (పల్మనరీ ఎంబోలిజమ్) ఏర్పడవచ్చు. ఈ రక్తపు గడ్డలు ఐవిసి ఫిల్టర్ అనే చిన్న పరికరాన్ని అమర్చడం ద్వారా అరికట్టవచ్చు.
పర్మినెంట్ పేస్ మేకర్…
గుండె నాడీ వ్యవస్థ (కండక్షన్ సిస్టమ్)లో ఏర్పడే లోపాల వల్ల నాడీ స్థాయి కొన్నిసార్లు పడిపోయి గుండె ఆగిపోవచ్చు. వీటిని పేస్ మేకర్ అనే పరికరం అమర్చడం ద్వారా సరిచేయవచ్చు.
ఎఐసిడి ఇంప్లిమెంటేషన్…
కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగి (నిమిషానికి 200-250సార్లు) కొట్టుకొని గుండె ఆగిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్ (ఎఐసిడి) అనే పరికరం అమర్చడం వల్ల ప్రాణాపాయాన్ని అరికట్టవచ్చు.
సిఆర్టి- డి…
గుండె కండరం బలహీనపడి, పంపింగ్ తగ్గినప్పుడు గుండె ఆగిపోయే పరిస్థితికి దారి తీస్తుంది. సిఆర్టిడి పేషెంటుకు అమర్చడం వల్ల బలం పుంజుకునేటట్లు తోడ్పడుతుంది.
కెథెటర్ ఇంటర్వెన్షన్స్ ఇన్ కాంజినిటల్ హార్ట్ డిసీజ్ (పుట్టకతో వచ్చే లోపాలను సరిచేయడం)…
గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్ళే ధమని (అయోర్టా) పుట్టుకతో సన్నపడవచ్చు. దీన్ని కూడా బెలూన్ పద్ధతిలో సరి చేయవచ్చు.
ఎఎస్డి క్లోజర్.. విఎస్డి క్లోజర్…
పుట్టుకతో గుండెలో ఉన్న రంధ్రాలను డివైజ్ క్లోజర్ ద్వారా ఆపరేషన్ లేకుండా మూసి వేయవచ్చు.
పిడిఎ క్లోజర్…
గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే రెండు ప్రధాన రక్తనాళాలు విడివిగా ఉంటాయి. శుద్ధమైన రక్తం ఎడమ పక్క నుండి శరీరానికి పంప్ అవుతుంది. శరీరం చెడు రక్తం కుడి పక్కకు చేరి ఊపిరితిత్తులలో శుభ్రపడుతుంది. ఈ రెండు రక్తనాళాల మధ్య పిడిఎ అనే మార్గం వల్ల మంచి చెడు రక్తాల మిశ్రమం జరుగుతుంది. ఇది వ్యాధులకు దారి తీయవచ్చు. వీటిని సూక్ష్మనాళ పద్ధతి ద్వారా వేరు చేయడానికి (కాయిల్) అనేది ఉపయోగపడుతుంది. దీనిద్వారా పిడిఎ మార్గాన్ని మూసి వేయవచ్చు.
గుండెపోటు రావడానికి పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి
1. మధుమేహం
2. అధిక రక్తపోటు
3. ధూమపానం
4. అధిక కొవ్వు చేరడం
5. స్థూలకాయం
6. మానసిక ఒత్తిడి
7. వంశపారంపర్యం
మొదలైనవి ముఖ్యమైనవి. ఇవి కాక రక్తనాళాల్లో బ్లాకులు (అడ్డంకులు) ఏర్పడినప్పుడు కూడా గుండెపోటు వస్తుంది.
అధిక కొలెస్టరాల్ వల్ల అనర్థాలు…
రక్త నాళాల్లో కొవ్వు చేరడం ద్వారా గుండెపోటుకు దారి తీయడం, పక్షవాతం మొదలైనవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవలసిందిగా వైద్యులు సూచిస్తారు.
గుండె పోటు వచ్చిన తర్వాత ఎంతకాలంలో బైపాస్ చేయించుకోవాలి…
ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి తీవ్రత నిర్ధారించిన తర్వాత ఇది నిర్ణయించడం జరుగుతుంది. గుండెపోటు వచ్చిన ప్రతి వారరికీ బైపాస్ అవసరం ఉండదు.
బెలూన్ ఆంజియోప్లాస్టి, బైపాస్ సర్జరీల్లో ఏది ఉత్తమం..
గుండె కండరాలకు రక్తప్రాసరంలో అడ్డంకుల వల్ల అది తగ్గినప్పుడు ఈ రెండు మార్గాలూ ఉత్తమమైనవే.
ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు…
ఆపరేషన్ తర్వాత మందుల వాడకం గురించి పలువురికి సందేహాలు ఉంటాయి. అయితే ఒక్కసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో కొవ్వు పదార్ధాలు లేకుండా చూసుకోవాలి. నిత్యం ఎంతో కొంత వ్యాయామం చేయాలి.
శారీరక శ్రమ ఎంతవరకు చేయవచ్చు…
ఎకో, టియంటి వంటి పరీక్షల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు. గుండె కండరం బలహీనపడకుండా మామూలు స్థాయిలో పంపింగ్ కనుక ఉన్నట్లయితే మామూలు స్థాయి పని చేసుకోవచ్చు.
స్టంట్స్ రకాలు, వాటి ఫలితాలు…
బెలూన్ ఎక్స్పాండబుల్ స్టెంట్స్, సెల్ఫ్ ఎక్స్పాండబుల్ స్టెంట్స్, బేర్ మెటల్ స్టెంట్స్ (బి.ఎం.ఎస్.), డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ (డి.ఇ.ఎస్) అన్నవి స్టెంట్స్లో రకాలు. స్టెంట్స్ వల్ల రక్తనాళాలు త్వరగా పూడుకుపోయే సమస్య పరిష్కారమవుతుంది.
రెండవ బైపాస్ ఎందుకు చేయాల్సి వస్తుంది…
జోడించిన రక్తనాళాలు మూసుకుపోవడం, కొత్త బ్లాకులు ఏర్పడటం వల్ల రెండవసారి కూడా బైపాస్ చేయాల్సి వస్తుంది.
బైపాస్ వల్ల రిస్కు ఎంత ఉంటుంది…
వయస్సు, గుండె పంపింగ్, మూత్రపిండాల పనితీరు, కారాటిడ్ వ్యాధు లు అన్న వాటిని బట్టి 1 శాతం నుండి 4 శాతం వరకు ఉండవచ్చు.
పిన్ హోల్ ప్రొసీజర్స్ (సూక్ష్మ నాళం ద్వారా) అంటే ఏమిటి…
ఆపరేషన్ లేకుండా సూక్ష్మనాళం ద్వారా అనేక గుండెవ్యాధులకు చేసే చికిత్సనే పిన్ హోల్ సర్జరీ అంటారు. పిటిసిఎ, పిబిఎమ్ వి, పేస్ మేకర్, ఎఐసిడి, ఐవిసి ఫిల్టర్స్, ఎఎస్డి/విఎస్డి క్లోజర్స్ వంటివి.
మందుల వల్ల దుష్పరిణామాలు…
గుండె వ్యాధులు ఉన్నవారు వాడే మందులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్పిరిన్ వాడకం వల్ల గాస్ట్రైటిస్, ఆల్సర్లు వస్తాయి. స్టాటిన్స్ వాడకం వల్ల కండరాల నొప్పులు, కాలేయ సమస్యలు వస్తాయి. నైట్రేట్ల వాడకం వల్ల తలనొప్పులు, క్లోపిడోపెరాల్ వంటి మందుల వల్ల త్రాంబసీ వంటివి వస్తాయి.
SURYA TELUGU
పోషక, ఔషధ పరిమాళాల జామ
పోషక, ఔషధ పరిమాళాల జామ
ఇంగ్లీషులో ‘గావా’గా పిలువబడుతున్న జామ‘గావా ఆపి ల్’గా పేరొందింది. ఆపిల్ కన్నా సరసమైన ధరలో లభిస్తు న్నందన‘పేదల పాలిటి ఆపిల్’గా కూడా ప్రసిద్ధి. పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే వాటిలో జామపండును పేర్కొనవచ్చు. విటమిన్లు ప్రధానంగా ‘సి’ విటమిను నారింజపండు కంటే 5 రెట్లు అధికమని అంచనా. కొలెస్ట్రాల్ బొత్తిగా వుండదు.యాంటికాన్సర్ కారకాలైన యాంటి యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయని శాస్తజ్ఞ్రుల అధ్యయనంలో తేలింది. వైటమిన్ ‘ఎ’, మానవశరీర నిర్మాణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బీటా కెరోటిన్లు ఈ పండులో సమృద్ధిగా వున్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు నిషేధించబడని ప్రయోజనకారి జామపండు. అయితే వీటి లోనూ దోరకాయ చాలా మంచిది.
వృక్షశాస్త్ర వర్గీకరణలో ‘మిర్టేసి’ కుటుం బానికి చెందిన జామను శాస్ర్తీయంగా ‘సీడియమ్ గావా’గా పిలుస్తారు. ఉష్ణ, ఉపఉష్ణమండలాలలో విస్తరించి మధ్య రకమైన ఎత్తులో వుండే జామ పుష్పాలు తెలుపు రంగులో వుంటాయి. అనేక కేసరాలు లేత పసుపు వర్ణం లో పొందికగా చూడముచ్చటగా కనిపిస్తాయి.ఫలాలు తెలుపు లేక ఎరుపు, ఆరంజి రంగుల్లో వున్న కండను కలిగి వుండి మధ్య భాగంలో చిన్న చిన్న విత్తనాలు అమరి వుంటాయి. చిన్నవైనా ఇవి దృఢంగా వుంటాయి. కొన్ని రకాలలో మెత్తగానూ వుంటాయి.చెట్ల నుండి మనం పొందే అన్ని రకాల ఫలాలలోకి శక్తివంత మైన యాంటిఆక్సిడెంట్ల విలువలు అధికం.తెల్ల గుజ్జులో కంటే ఎరుపు, ఆరంజి కండలో బీటాకెరోటిన్లు, పాలిఫినాల్స్, కెరటి నాయిడ్స్ హెచ్చు.పోషకవిలువల రీత్యా 165 గ్రా విడి పండులో నిపుణుల పరిశీల ప్రకారం
ఔషధ రీత్యా పరిశీలిస్తే…
- చెట్టు బెరడు డికాక్షన్ సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. 2,3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. దృఢత్వం కూడా చేకూరుతుంది. 5,6 ఆకులను నీటిలో మరగకాచి డికాక్షన్ వాడి తే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుండి లభించే తైలం యాంటి ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి. ఆకులతో తయారైన మందులు డయేరియా, డిసెంట్రీలకు మంచి ఫలితాన్నిస్తాయి.
- బాగా మాగిన పండును రోజూ తీసుకుంటే రక్తపోటు నియం త్రణలో వుంటుంది. ఎసిడిటికి కూడా రోజుకో పండును వాడితే మంచిది. పచ్చి కూరగాయ ముక్కలతో పాటు జామకాయ ముక్క లను కలిపి వాడితే ఊపిరితిత్తుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడా నికి దోహదం చేస్తుంది.
- ఇందులోని కెరొటినాయిడ్స్, ఐసోఫావో నాయిడ్స్, పాలిఫినాల్స్ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
- కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. డైటింగ్ చేసేవారికి జామపండు బలవర్ధక ఆహారం.
- లేత పసుపు, తెలుపు, లేత ఆకుపచ్చ రంగులలో గుండ్రంగా లేదా అండాకారంలో వుండే జామపండ్లు సువాసన కూడా కలిగి వుంటాయి. ఈ సువాసన వల్లే ఇంటిలో ఎక్కడ వున్నా ఇట్టే పట్టే యవచ్చు. ఏ మాత్రం అవకాశం వున్నా ఈ చెట్లను పెంచి తాజా ఫలాలను పొందవచ్చు. జామ పండును నాలుగు భాగాలు చేసి చిటికెడు ఉప్పు, కారం లేక మిరియాల పొడిని చల్లి తింటే చాలా బాగుంటుంది. జామ్, జెల్లీ, సలాడ్స్, కెండిల్స్ వగైరాలలో వీటిని వాడుతూ వుండటం తెలిసిందే.
- పోషకాల రీత్యా, ఔషధ గుణాల రీత్యా ఇంతటి విశేషాలున్న జామ పండును ఉపేక్షించక ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది.
శక్తి... 112 కెలరీలు. పీచు పదార్థాం 8.9గ్రా పిండి పదార్థం 23.6గ్రా మాంసకృత్తులు 4.2గ్రా కొవ్వు పదార్థం 1.6 గ్రా పొటాషియం 688మి.గ్రా భాస్వరం 66 మి.గ్రా సున్నం 30 మి.గ్రా వైటమిన్ ‘ఎ’(రెటినాల్) 1030 మైక్రోగ్రా వైటమిన్ ‘సి’(ఆస్కార్బిక్ ఆమ్లము)377 మిగ్రా ఫోలిక్ ఆమ్లము 81 మిగ్రా
– కె.భార్గవి
surya telugu
పర్యావరణ పరిరక్షణలో… గో గ్రీన్ క్లబ్
పర్యావరణ పరిరక్షణలో… గో గ్రీన్ క్లబ్
సామాన్యుల విమా నంగా ప్రసిద్ధి గాం చిన సైకిల్ను నేడు కొందరు కుర్రకారుకు ఇష్టమై న వాహనంగా మారింది. బైక్ లేకుండా కనీ సం బయటకు అడుగుపెట్టని కుర్రవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకో వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని పెద్ద లు అంటున్నారు. పర్యావరణానికి ఎటువం టి కాలుష్యాన్ని అందించని వాహనం ఇది. సురక్షితమైన, నిరాటంకంగా సాగి పోయే సైకిల్, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎంతో మేలు కూడా చేస్తుంది.
రోజురోజుకీ భూమిపై పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించే పాత్రలో నేడు సైకిళ్లు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. అందుకే పలు దేశాల ప్రజలు నేడు సైకిల్పై ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అదే తరహాలో హైదరాబాద్వాసులు కూడా సైకిల్నే వాడాలని నిశ్చయించుకుంటు న్నారు. అలాగే తమ స్నేహితులకు కూడా సైకిల్వాడండని నెట్ ద్వారా మెసేజ్లు ఇస్తున్నారు. దాంతో నగరంలోని సైక్లింగ్ క్లబ్లలో సభ్యుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
ఆరోగ్యం కలిగిస్తుంది…
ఎంతటి మహానగరంలోనైనా పోస్ట్మన్, పాలవాడు, పేపర్వాడు సైకిల్నే తమ వాహనంగా వినియోగిస్తుంటారు. ఇరుకైన సందుల్లో వేగంగా పోవడానికి వీలుగా, మెయింటెన్స్కి పెద్ద ఖర్చు చేయన వసరం లేకపోవడం వంటి పలుకారణాల వల్ల వీటిని ఉ పయోగి స్తుంటారు. అయితే ఇప్పుడు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కూడా తమ కార్లకు బదులు సైకిల్నే ఉపయోగిస్తున్నారు. నెలకు ఐదంకెలు జీ తం కలిగిన వారు కూడా వీటివైపే మొగ్గుచూపుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే కిషోర్ ఇంటికి తను పనిచేసే ఆఫీసుకు మధ్య దూరం నాలుగు కిలోమీటర్లు. అందుకని తను కారును ప్రక్కన పె ట్టి సైకిల్ మీదనే ఆఫీసుకు వెళుతుంటాడు.
వారానికి ఒక్క సారిమా త్రమే తన కారును ఉపయోగిస్తాడు. ‘సైకిళ్లు పర్యావరణాన్ని కాపా డడమే కాకుండా, ఆర్యోగం కలిగిస్తాయి, ఆర్థికంగా కూడా ఆదా . వీటికోసం పెట్రోలు, డీజల్ వంటి ఇంధనాలేమీ కొనక్కర్లేదు, అలా గే మధ్యలో ఎక్కడైనా ఆగిపోతుందని భయమేలేదు. ఈ రోజుల్లో ప్రపంచంలోని అభివృద్ధిచెందిన ఎన్నో దేశాలు సైకిల్కు ప్రాము ఖ్యత ఇస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల విపరీ తంగా మారిపోతున్న వాతావరణ మార్పులను అరికట్టేం దుకు ఇందన వాహనాలకు బదులుగా సైకిల్ను వాడు తున్నారు’ అని కిషోర్ అన్నారు.
సింపుల్ ఐడియా…
మన దేశ పట్టణాల్లో , నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీలకు, పెట్రోలు, డీజల్ రోజురోజుకూ పెరిగిపో తుండటం వల్ల ప్రత్యామ్నాయ మార్గంగా సైకిల్ బాగా ఉపయోగపడుతుంది.ఆఫీసుకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాఫిక్లో చిక్కుకుంటే ఆ గాలికాలుష్యం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటన్నింటికీ పరి ష్కార మార్గంగానే ప్రభాకర్రావ్ అనే అతను గోగ్రీన్ సైక్లింగ్ క్లబ్ను నెలకొల్పారు.‘ కారు, బైక్లు ఉన్నవారికి సైకిల్ కొనడం ఏ మంత కష్టం కాదు. ఇందువల్ల ఎంతటి రద్దీ ట్రాఫి్లోనైనా సుర క్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. నాలుగువందల మంది తో బెంగ ళూరులో ఉన్న మా క్లబ్ ప్రస్తుతం హైదరాబాద్లో కూడా నెల కొల్పాలని అనుకుంటున్నాం. సైక్లింగ్ వల్ల కలిగే లాభాలను అన్ని కార్పొరేట్ ఆఫీసులలో పనిచేసేవారికి, విద్యార్ధులకు మరోసారి తెలి యజేస్తున్నాం. చాలా మంది క్లబ్లో జాయిన్ అవుతామని ముందు కొచ్చారు.పర్యావరణానికి మేలుచేయడానికి తమ వంతు కృషిని అందిస్తామని చెబుతున్నారు’ అని ప్రభాకర్ అన్నారు.
తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు…
నేటి రోజుల్లో వాహన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దూర ప్రాంతాలకు వెహికల్స్ను వాడడం మంచిదేకానీ, దగ్గరగా ఉ న్న ఆఫీసులకు కూడా వీటినే ఉపయోగించడం వల్ల, ట్రాఫిక్ జామ్ లతో ఎంతో ఇంధనం వృధాగా ఖర్చు అవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కొందరు యువకులు కాలేజీలకు, ఆఫీసులకు ప్రత్యా మ్నాయమార్గంగా సైకిల్ ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తు న్నారు. పర్యావరణ కాలుష్యం తగ్గించేందుతమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ‘మా ఇంటినుంచి కాలేజీ దగ్గరే. అంటే ఒక కిలోమీట ర్ ఉంటుంది. ఇంతకు ముందు వరకు కాలేజీకి నా బైక్మీద వెళ్లే వాడిని, అయితే కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్జామ్ వల్ల చా లా ఇంధనం వృధా అవుతుండేది.
దీనివల్ల పర్యావరణానికి హాని తో పాటు భవిషత్ తరాలకు ఇందన కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.అదీ కాకుండా ఇప్పుడు ఏదేశంలో చూసినా భూమిని రక్షించుకోవాలనే తపన ఎక్కువైంది.అందువల్ల పర్యావరణాన్ని త ద్వారా భూమిని కాలుష్యం నుంచి కాపాడే చర్యలో నావంతు కృషి చేయాలనుకున్నాను. ఇ అప్పటినుంచి దూర ప్రాంతాలకు, అత్య వసర పరిస్థితిల్లో తప్పించి బైక్ వాడను కాలేజీకి కూడా ఇప్పుడు కొత్తగా కొన్న సైకిల్ మీదే వెళుతున్నాను. అలాగే సైకిల్ క్లబ్లో కూ డా చేరాలని నిశ్చయించుకున్నాను. ముందు మా ఫ్రెండ్స్ నవ్వు కున్నా ఎందుకు చేశానో చెప్పినప్పుడు చాలా సంతోషించారు. కాలేజీ దగ్గర ఉన్న విద్యా ర్థులంతా ఆ రోజునుంచి సైకిల్ మీదనే కాలేజీకి వస్తున్నారు.పర్యావరణం గురించి పూర్తిగా తెలుసుకున్నారు’ అని మున్నా అన్నాడు.
ప్రభుత్వం కూడా చొరవచూపాలి…
‘నేడు చాలామంది కుర్రకారు సైకిల్ను తమ వాహనాలుగా చేసు కుంటున్నారు. పర్యావరణానికి రక్షణగా వస్తున్న ఈ సైకిల్ ట్రెండ్ ను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. సైకిల్ ప్రయాణానికి అను గుణంగా రోడ్లనందు ప్రత్యేక మార్గాన్ని ప్రవేశపెట్టాలి. చొరవచూపి సైకిల్ వాడకాన్ని పెరిగేలా చేయాలి. అలాగే పర్యా వరణానికి ఎంత టి ముప్పు కాలుష్యంవల్ల వాటిల్లుతుందో తెలియజేయాలి. స్కూళ్లు, కాలేజీలలో పోస్టర్లు అంటించడం, విద్యార్థులతో సమావేశమై భూ మిని రక్షించుకోవాల్సిన అవసరం మనపై ఎంతుందో వారికి అర్థమ య్యేలా తెలియజేయడం ఎంతో అవసరం.
ఇలాంటివి చేయడం వల్ల విదార్థులో కాలుష్యాన్ని తగ్గించాలనే తపన పెరుగుతుంది. వీరే కాకుండా ఉద్యోగులు, వ్యా పారస్తులుకూడా వీటి గురించి ఆలో చిస్తే మంచిది. చాలా మంది పక్కనే ఉన్న షాపుకు లేదా ఆఫీసులకు బైక్ లేదా కారును ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది తమ హోదాను తెలుపడం కోసం కార్లను ఉయోగిస్తుంటారు. వీరందరూ తమ హోదాలను మరిచి తక్కువ దూరంఉన్న చోట్లకు సైకిల్ను వాడడం ఎంతో మంచిది. అప్పుడే మనం మన భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించిన వారమవుతాము’ అని లెక్చరర్ నారాయణ తెలిపారు.
Surya Telugu Daily.
మహిళలను బాధించే గర్భాశయ క్యాన్సర్
మహిళలను బాధించే గర్భాశయ క్యాన్సర్
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. దీనినే ఎండోమెట్రిక్ క్యాన్సర్ అని అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా డబ్బున్న కుటుంబాలలోని మహిళలకు ఎక్కువగా వస్తోంది.వారి జీవనశైలే ఈ వ్యాధి రావడానికి కారణంగా పేర్కొనవచ్చు.
గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ వ్యాధిగ్రస్థులతోపాటు గర్భాశయ క్యాన్స ర్ వచ్చే మహిళల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. మెనోపాజ్, పెరి మెనోపాజ్ వాళ్లకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పిల్లలు లేని వారిలో ఈ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. ఒబెసిటీ, బిపి, షుగర్ ఉన్న మగువల్లో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశా లున్నాయి. మెనోపాజ్లో ఉన్న మహి ళల్లో ఈస్ట్రోజోన్ థెరపీ తీసుకుంటే వారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. ఎక్కువ బ్లీడింగ్ జరిగే స్ర్తీలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. కుటుం బంలోని ఒకరికి ఈ వ్యాధి ఉంటే మరొకరికి సైతం రావచ్చు. గర్భా శయం పొరలు మందంగా ఉన్న వాళ్లలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి.
వివిధ రకాలుగా…
ఎండోమెట్రిక్ క్యాన్సర్ గర్భా శయంలో చిన్న గడ్డల మాదిరిగా ప్రారంభమవుతుంది. ఇందులో మూడు గ్రేడులు ఉంటాయి. ఒకటవ గ్రేడ్ను ప్రారంభ దశగా పరిగణిస్తే రెండు, మూడు గ్రేడులను ప్రమాదకరంగా భావిస్తారు. ఈ వ్యాధిని నాలుగు స్టేజ్లుగా విభజిస్తారు. మొదటి స్టేజ్లో గర్భాశయం లోపలి పొరల్లో వస్తే, రెండవ స్టేజ్లో గర్భాశయం మధ్య పొరల్లో(మజిల్స్), మూడవ స్టేజ్లో గర్భాశయం బయట కూ డా వ్యాధి వస్తుంది. బాగా ముదిరిన తర్వాత వచ్చే నాలుగవ స్టేజ్లో గర్భాశయం పక్కన ఉండే ఊపిరితిత్తులు, బ్లాడర్ తదితర అవయవాలకు సైతం ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు…
గర్భాశయ క్యాన్సర్ వచ్చిన మహిళల్లో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. పీరి యడ్స్ ఆగే ముందు బ్లీడింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే స్ర్తీలు వెంటనే డాక్టర్ను సంప్రదించి చెకప్ చేయించుకోవాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో గర్భాశయానికి చీము పట్టవచ్చు. కడుపులో నొప్పిగా ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. బరువు తగ్గడం, ఆకలి లేకపో వడం, ఆయాసం రావడం జరుగుతుంది.
వ్యాధి నిర్ధారణ…
ఎండోమెటల్ బయాప్సి ద్వారా వ్యాధి నిర్దారణ చేస్తారు. వ్యాధిగ్రస్థులకు రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్దారణ చేస్తారు. ఈ పరీక్షలలో యుటెరస్ సైజు పెరిగిందా, గడ్డలు ఉన్నాయా అని తెలు సుకుంటారు. మిగతా ఆర్గాన్స్కు ఏమైనా వ్యాధి వ్యాపించిందా అని పరీక్షిస్తారు. అవసరమైతే సీటి స్కాన్ చేస్తారు. ఎంఆర్ఐ నిర్వహిస్తారు. ఇందులో వ్యాధి యుటెరస్కు ఎంత పాకింది. ఎముకలు, ఊపిరితిత్తులకు వ్యాధి సోకిందా అని తెలుసుకుంటారు.
నివారణ…
లావుగా ఉన్న మహిళలు, హార్మోన్ల మార్పిడి, ఈస్ట్రోజన్ మార్పిడి చేయించుకున్న మగువలు రెగ్యులర్గా డాక్టర్ను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలి.వీరికి గర్భాశయ సమస్యలు తీవ్రమైతే యుటిరస్ను తీయించుకోవాల్సి ఉంటుంది.
చికిత్స…
ప్రీమా లిగ్నమెంట్ స్టేజ్లో ఉన్న వ్యాధిగ్రస్థులు రెగ్యులర్గా డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి. వీరికి అవసరమైతే ప్రొజిస్ట్రీన్ హార్మోన్ సప్లిమెంట్ ఇస్తారు. ప్రొజిస్టరాన్ చికిత్స నిర్వహిస్తారు. గర్భాశయం క్యాన్సర్ బాగా ముదిరితే యుటిరస్ను తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకటవ స్టేజ్లో ఉన్నవారు యుటిరస్, ఓవరీస్ తీసివేస్తారు. అవసరమైతే రేడియో థెరపి, కీమా థెరపి చేస్తారు. రెండవ స్టేజ్లో ఉన్నవారు రేడియో థెరపీతో పాటు హార్మోన్లను కూడా అందజే స్తారు. కీమో థెరపీ కూడా ఇస్తారు. పీరియడ్స్ ఆగిపోయిన మహిళలు రెగ్యులర్గా డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి. మెనోపాజ్లో ఉన్నవారికి మొత్తం స్క్రీనింగ్ చేయించు కోవాల్సి ఉంటుంది.
Surya Telugu Daily .
సంతాన ప్రాప్తిరస్తు ! సంతానలేమి అంటే…
సంతాన ప్రాప్తిరస్తు ! సంతానలేమి అంటే…
స్ర్తీ సంపూర్ణత్వానికి ప్రతీకగా మాతృత్వాన్ని చెబుతారు. అలాంటి మాతృత్వాన్ని పొందలేని వారెందరో నేడు సమాజంలో ఉన్నారు. ఈ విధమైన సంతానలేమి లోపాలు మహిళల్లోనూ కాకుండా పురుషుల్లోనూ ఉండవచ్చు. లోపం ఎవరిలో ఉన్నా కూడా ఆ లోపాన్ని సరిజేసి సంతానం పొందే భాగ్యాన్ని కలిగించే ఆధునిక చికిత్సలూ నేడు అందుబాటులో ఉన్నాయి. సంతానలేమిపై అపోహలు, కారణాలు, చికిత్స విధానాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం… సంతాన ప్రాప్తిరస్తు.
సంతానలేమి అంటే…
ఒక ఏడాది కాలం పాటు ఎలాంటి గర్భనిరోధకాలు వాడకుండా, గర్భధారణ కు ప్రయత్నించి నప్పటి కీ ఓ జంటకు సంతా నం కలగకపోవ డా న్ని లేదా గర్భ దార ణ జరగకపో వడా న్ని సంతాన లేమి గా చెప్పవచ్చు.
సంతానలేమికి కారణాలేంటి?
మహిళలో లేదా పురుషు నిలో లేదా ఇద్ద రి లోనూ ప్రత్యుత్ప త్తి వ్యవస్థలో ఉండే సమస్యలు సంతాన లేమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దిగువ పేర్కొన్న అంశాలకు సంబం ధించిన సమస్యలను సంతానలేమికి ముఖ్యకారణాలుగా పేర్కొనవచ్చు.
* పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
* మహిళ ఫాలోపియన్ ట్యూబ్లు
* మహిళ గర్భాశయం లేదా సెర్విక్స్
*మహిళ రుతుచక్రం
* సాధారణ పరీక్షల్లో వెల్లడి కాని కారణాలు
సంతానలేమి సమస్య అరుదా? సాధారణమా? తీవ్రత ఏ స్థాయిలో ఉంది?
ప్రతీ ఆరు జంటల్లో ఒక జంట ఏదో ఒకస్థాయిలో ఎంతో కొంత మేరకు సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరికి వైద్యసలహా లేదా చికిత్స అవసరమవుతుంది.
సాధారణంగా ఫలదీకరణ ఎలా జరుగుతుంది?
పురుషవీర్యకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణగా చెప్పవచ్చు. మహిళ ఫాలోపియన్ ట్యూబ్లలో ఈ ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలోకి చేరుకుంటుంది. అక్కడి యుటెరిన్ లైనింగ్లో స్థిరపడుతుంది. గర్భధారణ జరగాలంటే, ఫలదీకరణ చెందిన అండం ఈ విధంగా గర్భాశయాన్ని చేరుకోవాలి. ప్రతీ రుతుచక్రంలోనూ ఒక్కటే అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో ఆ అండం ఫలదీకరణం చెందకుండా ఉంటే తిరిగి రుతుచక్రం పూర్తయ్యే వరకూ గర్భధారణ సాధ్యపడదు.
సంతానలేమిని ఏవిధంగా నిర్ధారిస్తారు?
మొదట ఓ జంట మెడికల్ హిస్టరీని పరిశీలించడంతో పాటు వారికి వివిధ ఫిజికల్ పరీక్షలు నిర్వహించడం ద్వారా సంతాన సాఫల్యతలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తారు. ఈ పరీక్షలు దంపతులిద్దరికీ చేస్తారు. రక్తపరీక్ష, వీర్య విశ్లేషణ, అల్ట్రాసౌండ్ పరీక్షలు లేదా మహిళలకు ఎక్స్ప్లొరేటరీ సర్జరీ నిర్వహిస్తారు.
మహిళల్లో సంతానలేమి సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు?
సంతానలేమి సమస్య ఉందని నిర్ధారణ అయిన తరువాత ఏ విధమైన చికిత్స ఎలా, ఎప్పుడు చేయాలన్న ప్రణాళిక రూపొందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఓ చిన్న సలహా లేదా కొద్ది పాటి చికిత్సతోనే ఆశించిన ఫలితం దక్కే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం కావచ్చు.
పురుషుల్లో సంతానలేమి సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు?
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలను చాలా వరకు మందులతో లేదా అవసరమైతే సర్జరీతో పరిష్కరించవచ్చు.
పురుషుల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అంశాలేంటి?
పురుషుడి ఆరోగ్యం, జీవనశైలి ప్రభావం వీర్యం నాణ్యత, పరిమాణంపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు, ఒత్తిళ్ళు, పరిసరాల్లో ఉండే విషతుల్యాలు, ఆరోగ్యసమస్యలు, కొన్ని రకాల మందులు, కెమెథెరపీ, వయస్సు లాంటివి పురుషుల్లో సంతానలేమి సమస్యను ప్రభావితం చేస్తాయి.మహిళల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అంశాలేంటి? వయస్సు, ఒత్తిళ్ళు, పోషకాహార లోపం, స్థూలకాయం, బరువు తక్కువగా ఉండడం, ధూమపానం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీడీ), హార్మోన్ల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు మహిళల్లో సంతాన లేమి సమస్యకు దారి తీసే అవకాశం ఉంది.
వయస్సు ఓ మహిళ సంతాన సాఫల్యత అవకాశాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
మహిళల్లో అండం నాణ్యత వయస్సు పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఏళ్ళు పైబడుతున్న కొద్దీ అండం ఫలదీ కరణం చెందే శక్తి కూడా సన్నగిల్లుతుంటుంది. అండం విడుదలలోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. రుతు చక్రంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అబార్షన్ అయ్యే అవకాశాలు అధికం అవుతుంటాయి.
సంతానలేమి సమస్యలు వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా?
సంతానలేమి సమస్యలు చాలావరకు వారసత్వా నికి సంబంధిం చినవి కావు.
సంతానలేమి చికిత్సలు ఎంత వరకు విజయవంత మవుతాయి?
చిక్సిత పొందతున్న దంపతుల్లో చాలామం ది ఔషధాలు, సర్జరీల్లో మెరుగుదల, ఏఆర్టీ (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాల జీ) లాంటి వాటివల్ల గర్భధారణ పొందే అవకాశం ఉంది. ఏఆర్టీ కింద చికిత్స పొందే దంపతుల్లో సక్సెట్ రేటు బాగా వృద్ధి చెందింది. ఏఆర్టీలో విజయాన్ని ప్రభావితం చేసే అం శాలు ఎన్నో ఉంటాయి. ఐయూఐలో 15 -20 శా తం దాకా, ఐవీఎఫ్లో 40-50 శాతం దాకా విజయా వకాశాలు ఉంటాయి.
దంపతుల్లో మహిళ వయస్సు 34 ఏళ్ళ కంటే తక్కువగా ఉండి, 12 నెలల పాటు ఎలాంటి గర్భ నిరో ధక సాధనాలు ఉపయోగించనప్పటికీ, గర్భం దాల్చకుం టే సంతానలేమి సమస్య ఉన్నట్లుగా భావిస్తారు. మహిళ వయ స్సు 35ఏళ్ళు దాటిన సందర్భంలో వైద్యులను సంప్రదించేం దుకు 6 నెలల సమయానికి మించి వేచిచూడ కూడదు.(వయస్సు పెరుగుతున్న కొద్దీ అండం నాణ్యత లోపిస్తుంటుంది.)
చాలావరకు, ఎలాంటి గర్భనిరోధకాలు ఉపయోగించకుండా సజావుగా దాంపత్య సంబధాలు కలిగి ఉంటే ప్రతీ 100 జంటల్లో 84 జంటలు ఏడాదిలోగానే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఏడాదిలో గాకున్నా, రెండేళ్ళ లోపు గర్భం దాల్చే అవకాశం 92 జంటల్లో ఉంటుంది. 35 ఏళ్ళు దాటిన మహిళల్లో, గర్భ ధారణ కోసం ప్రయత్నిస్తున్న మూడేళ్ళలోగా గర్భం దాల్చే అవకాశం నూటికి 94 మందిలో ఉంటుంది. 38 ఏళ్ళు దాటితే మాత్రం నూటికి 77 మంది మా త్రమే గర్భం దాల్చగలుగుతారు. బ్రిటన్లో ఐవీఎఫ్ చికిత్సను ఆశ్రయించే దం పతుల్లో సగం జంటల్లో పురుషుడు సంతానలేమి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. స్వీడన్లో కనీసం 10 శాతం దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.
ప్రధాన కారణాలు
జన్యుకారణాలు: క్రోమోజోము ల అమరికలో మార్పులు
సాధారణ కారణాలు: డయాబెటి స్ మెలిటస్ (టైప్2 డయాబెటిస్), థైరాయిడ్ సంబంధితాలు, అడ్రెనల్ (కిడ్నీల పైభాగంలో ఉండి వివిధ హా ర్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథి)వ్యాధి
హైపొథాలమిక్ పిట్యుటరీ సంబంధితం: మెదడు దిగువ భాగంలో ఉండే పిట్యుటరీ గ్రంథి ఉత్పత్తి చేసే 8 రకాల హార్మోన్లలో ఏదేని ఒక దాని ఉత్పత్తి తగ్గిపోవడం,
కాల్మాన్ సిండ్రోమ్: సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు తగ్గిపోవడం. రక్తంలో ప్రోలాక్టిన్ పరిమాణం అధికంగా ఉండడం.
పరిసరాల ప్రభావం: వివిధ రకాల విషతుల్యాలు, రసాయనాలకు చేరువలో ఉండడం.
ధూమపానంతో చేటు:పొగతాగని వారితో పోలిస్తే పొగ తాగే వారు 60 శాతం అధికంగా సంతానలేమి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పొగతాగే వారిలో ఐవీఎఫ్ ద్వారా శిశు వును పొందే అవ కాశం 34 శాతం తగ్గిపోతుం ది. గర్భస్రావం అయ్యే అవకాశాలు 30 శాతం పెరుగుతాయి.
8. జన్యుఉత్పరివర్తనాలు: మానవ డీఎన్ఏలో చోటు చేసుకునే మ్యుటేషన్స్ (ఉత్పర్తివర్తనం) కూడా సంతానలేమి సమస్యలకు దారి తీయ గలదు.
మహిళల్లో సంతానలేమి: 35 ఏళ్ళు పై బడిన మహిళ ఆరునెలలు ప్రయత్నిం చి నా గర్భం దాల్చని పక్షంలో మరో ఏడాది అం టూ వేచి చూడకుండా వెంటనే వైద్యు లను సంప్రదించడం ఉత్తమం. ఆమెకు అప్పటికే గర్భాశయ సమస్యలేవైనా ఉ న్నా, భాగస్వామికి స్పెర్మ్కౌంట్ (వీర్య కణాల సంఖ్య) తక్కువ ఉందని అప్ప టికే తెలిసినా మరింత ఆలస్యం చేయ కుండా డాక్టర్ను సంప్రదించాలి. 40 ఏ ళ్ళు దాటిన మహిళలు మూడు నెలల పాటు ప్రయత్నించినా గర్భందాల్చని పక్షంలో వెను వెంటనే నిర్ధారణ పరీక్షలు, చికిత్స ప్రారంభించాలి.
మహిళల్లో సంతానలేమికి కారణాలు:
రుతుచక్రం, ఆరోగ్యదాయక అండాల ఉత్పత్తి: రుతుచక్రం ముగియడానికి 14 రోజులు ముందుగా అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. మహిళ గర్భం దాల్చేందుకు అనువైన సమయమిది.
అనువైన వీర్యం:వృషణాల్లో వీర్యం వృద్ధి చెంది ఉత్పత్తి అయ్యేందుకు 64 రోజులు పడుతుంది. స్ఖలనం సందర్భంగా వీర్యం వెలుపలికి వస్తుంది. ఆ వీర్యంలో 100 మిలియన్ల దాకా వీర్యకణాలుంటాయి. ఇందులో కొన్ని వందలు మాత్రమే ఫాలోపియన్ ట్యూబ్ (స్ర్తీ బీజవాహిక) లను చేరుకోగలుగుతాయి.బీజవాహికల గుండా పయనించి వీర్యకణాలను చేరుకునే శక్తి అండానికి ఉండడంసెర్విక్స్ ద్వారా పయనించి అండాన్ని చేరుకునే శక్తి వీర్యకణాలకు ఉండడం
అండాన్ని ఫలదీకరించే శక్తి వీర్యానికి ఉండడం: వీర్యకణాల సంఖ్య, నాణ్యతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. వీర్యకణాల నాణ్యత అంటే ముందుకు వెళ్ళేందుకు వీర్య కణాలకు ఉండే కదలిక శక్తి, ఆకారం.ఫలదీకరణ చెందిన అండం ఆరోగ్య వంతమైన పిండం గా మారి గర్భాశ యంలో నిలదొక్కు కోగలుగుతుంది.
Surya Telugu Daily .
కిడ్నీలను కాపాడుకుంటే మనం క్షేమం… మార్చి 10న వరల్డ్ కిడ్నీ డే
కిడ్నీలను కాపాడుకుంటే మనం క్షేమం… మార్చి 10న వరల్డ్ కిడ్నీ డే
మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచజీుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.
నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.
గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు సెగ:
మన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.
కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు
టైప్-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్- 3 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.
1. మూత్రంలో అల్బుమిన్:అల్బుమిన్ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.
2. రక్తంలో సిరమ్ క్రియాటిన్:మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని ( ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్-ఈజీఎఫ్ఆర్(ను లెక్కించి… కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్ క్రియాటినైన్ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్ఆర్’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్ క్రియాటినైన్ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్ఆర్’ లెక్కిస్తారు.
కిడ్నీలను కాపాడుకోవాలంటే?
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.
Surya Telugu Daily .
జ్యూసులతో తేజస్సు..
జ్యూసులతో తేజస్సు..
కొందరి చర్మం మెరిసిపోతూ ఆరోగ్యంగా వుంటుంది. మరి కొందరిది పాలిపోయినట్లు నిర్జీవంగా వుంటుంది.ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఫలితం రాకపోగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం అవుతుంది. దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. లోపలిది కూడా.. కాబట్టి పైపై రంగులు, మేకప్ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి.ముఖ్యంగా మెరిసే చర్మం కోసం జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి.
టమాటా :
టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది.అలాగే ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్ కూడా లభి స్తాయి.
క్యారెట్ :
తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్లో పోషకాలు కూడా ఎక్కువే. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో వుండే విటమిన్ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది.
జామకాయతో :
జామకాయలో వుండే పో షకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.
ఆపిల్ :
రోజూ ఒక ఆపిల్ తీసుకోవ డం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవ చ్చు. యాపిల్లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.
బీట్రూట్ :
లివర్కు మంచిది. కిడ్నీ లను శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలి నాలను తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. చర్మాన్ని మెరి సేలా చేస్తుంది. రుచికి కాస్త భిన్నంగా వున్నప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ దుంప.
పుచ్చకాయ :
90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.
Surya Telugu Daily .
మా మంచి తులసి…
మా మంచి తులసి…
వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో రారాజుగా వెలిగిపోతున్న మొక్క తులసి.. భారతీయ మగువలు ఎంతో పవిత్రంగా కొలిచే ఈ తులసి వంటింటి వైద్యంలో ఎంతో ముఖ్యం కూడా. కఫాన్ని, పైత్యాన్ని తీసివేయడంలో దీనికి మించినది లేదు. అంతేకాదు.. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు, జబ్బులకు మంచి మందు తులసి.
- జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంలో, నోటిసంబంధిత వ్యాధులకు, ఉబ్బసానికి మంచి మందు తులసి. చర్మవ్యాధులకు ఈ ఆకురసము మంచి ఫలితాన్నిస్తుంది.
- గాయాలకు, దెబ్బలకు, విష జంతువులు కరిచి నపుడు ఈ ఆకు రసాన్ని పూసినా, వాడినా సత్వర ఉపశ మనం కలుగుతుంది.
- ప్రతిరోజు 6-10 ఆకులు నమిలితే నోటి దుర్వాసన వుండదు. ప్రతి రోజు క్రమంగా పది ఆకులను తిన్నా లేక 1 చెంచా రసం పరగడుపున తాగినా ఆరోగ్యానికి మంచిది.
- ఆకురసం, కొంచెం తేనె, ఒక చెంచా అల్లం రసం రంగరించి వాడితే జీర్ణకోశ సమస్యలుండవు.
- తులసి రసంతో కొంచెం మిరియాల చూర్ణాన్ని కలిపి 2 చెంచాలు తింటే గొంతు బొంగురు పోవుటాన్ని, నీటిలో మరిగించి వడగట్టి తీసుకుంటే గొంతు గరగర, జలుబు, దగ్గు ఉన్నపుడు కఫం బయటకు వచ్చేటట్లు చేస్తుంది.
- దోమ కాటు వలన వచ్చే మలేరియా వ్యాధికి ఇది మంచి ఔషధం.
- ఇంటి ఆవరణలో ఈ చెట్లుంటే దోమలను పారదోలుతుంది. క్రిమిసంహారిగా కూడా పనిచేస్తుంది.
- ఆధునిక పరిశోధనలో క్షయవ్యాధికి కారణమయ్యే బేసిల్లస్ ట్యూబర్క్యు లోసిన్ అను బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి నశింపజేస్తుందని శాస్త్ర వేత్త లు వెల్లడించారు.
- పత్రాలలోని సూక్ష్మమైన తైల గ్రంథులల్లోని తైలంలో యూజినాల్, యూజినాల్ మిథైల్, ఈథర్, కార్వసిరాల్, అను రసా యనాలే సువాసనకు, సూక్ష్మ జీవులను నశించేట్లు చేస్తాయి.
- తులసి రసం, బెల్లం కలిపి తయారు చేసే తులసిసుధ అనే పానియం రక్తశుద్ధిని, వ్యాధి నిరోధకశక్తిని అభివృద్ది చేస్తుంది.
- ఈ ఆకుల రసంతో చేసిన టీ జలుబు, దగ్గును, ఉదరకోశ రుగ్మతలకు బాగా పని చేస్తుంది. తులసి వనాలు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి.
డార్క్ చాక్లెట్లతో గుండె సమస్యలకు చెక్..!!
<!–
–>చిన్న పెద్ద అంటూ వయో బేధం లేకుండా అందరినీ నోరూరించేవి చాక్లెట్లు. అయితే చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని, తింటే దంతాలు పాడవుతాయని చాలా మంది హెచ్చరిస్తుంటారు. ఇక నుంచి అలా అనే వాళ్లు మరొక్క సారి ఆలోచించుకోవాలేమో..!! ఎందుకంటే.. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
డార్క్ చాక్లెట్లు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్లోని హల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు డార్క్ చాక్లెట్లపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. దేహంలో ప్రమాదకర స్థాయికి పెరిగిన మధుమేహాన్ని తగ్గించటానికి డార్క్ చాక్లెట్లు చక్కటి ఔషధంలా ఉపయోగపడతాయని వారు తెలిపారు.
చాక్లెట్లలో పాలీఫినోల్ అనే పదార్థం అధిక స్థాయిలో అది కోకావా సాలిడ్స్ను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండే మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్థులకు తరచూ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. గత పరిశోధనలు కూడా కొలెస్ట్రాల్ గుండె సంబంధిత సమస్యను తగ్గిస్తుందని రుజువు చేశాయి.
ఈ తాజా పరిశోధనలో కోకావా విత్తనాలలో ఉన్న రసాయనాలు కొలెస్ట్రాల్ను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా టైప్-2 మధుమేహం కలిగిన 12 మంది వాలంటీర్లకు 16 వారాల పాటూ పాలీఫినోల్స్ అధికంగా ఉన్న చాక్లెట్ బార్లను ఇచ్చి పరీక్షించారు. అనంతరం వారి కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించి చూడాగా.. అది గణనీయంగా తగ్గింది.
“దీని అర్థం హృదయ సమస్యను తగ్గిస్తుంది” అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ స్టీవ్ అట్కిన్ అన్నారు. అధిక కొకావా ఉండే చాక్లెట్లు టైప్-2 డయాబెటిక్ వారికి కావలసిన డైట్ను అందించడంతో పాటు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని ఆయన అన్నారు. అయితే బ్రిటన్లోని కొందరు మధుమేహ నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ చాక్లెట్లలో అధిక స్థాయిలో కొకావాతో పాటు అంతే అధిక స్థాయిలో ఫ్యాట్ (కొవ్వు), షుగర్ (పంచదార)లు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మేలు కన్నా ఎక్కువ కీడునే కలిగిస్తాయనేది విమర్శకుల వాదన. బ్రిటన్లో దొరికే ప్రముఖ బ్రాండెడ్ చాక్లెట్ బార్లలో 200 కేలరీలు, 16 గ్రాముల వరకూ కొవ్వు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీర మంతా కొవ్వు పేరుకుపోతుందని వారు వాదిస్తున్నారు.
web duniya
పదునెైన ఆకృతికి ‘పంచా’ మృతాలు
పదునెైన ఆకృతికి ‘పంచా’ మృతాలు
అల్లం…
అల్లానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు సాఫీగా సాగేందుకు సైతం ఇది తోడ్పడుతుంది.ఉపయోగాలు: తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవుతుంది. వొవేరియన్ క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే శక్తి అల్లానికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడెైంది. జలుబు, మైగ్రేన్, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది.
మిరపకాయ…
ఎరట్రి పొడవెైన మిరపకాయల్లో క్యాప్సాసిన్ అనే రసాయనం ఉంటుంది. దీనికున్న గుణమేంటంటే కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజపరచి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.ఉపయోగాలు: ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని పరిశోధనల్లో స్పష్టమైంది. ఆకలి పుట్టించే గుణం కూడా దీనికుంది. ఈ రసాయనం శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూడడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్తవ్రేత్తలు తెలియజేస్తున్నారు.
ఆవాలు…
ఇక ఈ జాబితాలో తర్వాతి స్థానం ఆవాలదే. ఇవి కూడా దేహంలో జీవక్రియలను ఉత్తేజపరుస్తా యి.దాంతో అధికంగా ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు తగ్గడం సులభమవుతుంది.ఉపయోగాలు: రోజుకొక చెంచాడు ఆవపిండిని తీసుకుంటే 25 శాతం మేరకు జీవక్రియలు ఉత్తేజితమవుతాయని ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ పాలిటెక్నిక్ శాస్తవ్రేత్తల అధ్యయనం లో తాజాగా వెల్లడెైంది. అధిక రక్తపోటు తగ్గించడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుం ది. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, మాంగనీస్, జింక్, ప్రొటీన్, కాల్షియం, నయసిన్ సమృద్ధిగా లభిస్తాయి.
నల్ల మిరియాలు…
ఇప్పుడంటే వీటిని ఆహారంలో వాడడం తగ్గించాం కానీ పూర్వం మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినే ఉపయోగించేవారు. నల్ల మిరియాలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఉపయోగాలు: జీర్ణశక్తిని వృద్ధి చేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. తీసుకున్న ఆహారం ద్వారా శరీ రంలోని అన్ని భాగాలకూ పోషకాలందేలా చూస్తాయి. దీనిలో ఉండే పిపరిన్ రసాయనం దేహంలోని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.శరీర బరువు సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. తాజా మిరియాల్లో ఔషధ గుణాలెక్కువగా ఉంటాయి. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల బరువు తగ్గించడంతో పాటు అనేక రకాల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే మన రోజు వారీ ఆహారంలో వీటిని ఉపయోగించడం ఎంతో అవసరం.
దాల్చినచెక్క…
రోజులో ఒక్క చెంచాడు దాల్చినచెక్క పొడిని తీసుకున్నారంటే మీ అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది.ఆరోగ్యం, అందం కూడా మెరుగు పడుతుందని శాస్తవ్రేత్తలు జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడెైంది.ఉపయోగాలు: దీనికి రక్తంలో గ్లూకోజ్ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్టరాల్ను 27 శాతం వరకు తగ్గించే శక్తి దీని సొంతం. టైప్ 2 మధు మేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి. రక్తం గడ్డకుండా నిరోధిస్తుం ది. అలా అని దీన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్కి హాని చేస్తుంది.
Surya Telugu Daily
ఇంటిలోపల ఆరోగ్యకరమైన అలంకరణ
ఇంటిలోపల ఆరోగ్యకరమైన అలంకరణ
మనం సృష్టించుకున్న ల్యామినేట్స్ కాక సహజమైన సామగ్రి వాడితే మరింతగా విశ్రాంతినిచ్చే, తక్కువ మానసిక ఒత్తిడిని కలిగించే పరిస రాలు ఇంట్లో రూపొందుతాయి. ఎండ,గాలి వంటి సహజ వనరులను అత్యధికస్థాయిలో వాడడం, రంగులు ఫర్నిషింగ్ ఉపకరణాలు, లైటింగ్ పద్ధతులు. యాంత్రిక , ఎలెక్ట్రానిక్ పరికరాలను నియమానుసారం ఉపయో గించ డం- ఆరోగ్యకరమైన ఇంటిని రూపొందిస్తాయి. సరిగా జాగ్రత్త తీసుకోని యంత్రాలు, వాడేసిన ఇంట్లో పలి,వెలుపలి సామగ్రి ఇంట్లో రసాయనిక కాలుష్యాన్ని పెంచు తాయి. ఇంట్లో గాలిపై చెడుప్రభావం వేస్తాయి. చివరికి మన ఆరోగ్యంపై చెడుప్రభావం ప్రసరిస్తాయి.
సహజమైన తాజా గాలి: రసాయనిక ఏర్ఫ్రెషనర్లను వాడకండి- వాటికి బదులు బేకింగ్ సోడా లేక ఏ ఇతర సహ జమైన ఫ్రెషెనర్లను వాడండి. లేక కిటికీలను కాసేపు తెరిచి వుంచడండి. బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్లు, స్టేయి న్రిపె ల్లెంట్లు, రింకిల్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్లులేని ఫర్నిచర్, కార్పెట్లు, కర్టన్లు ఎంపిక చేసుకోండి. ఇంట్లో విరివిగా మొక్కలు పెంచుకుంటే విషకాలుష్యాన్ని అరికట్ట వచ్చు. ఇంట్లో పెరిగే మొక్కలు కెమికల్స్ను పీల్చుకుని వాటిని ఆహారంగా , శక్తిగా మారుస్తాయి. గాలిని శుభ్రపరు స్తాయి. ఇంట్లో ప్రతిగదిలో 100 చదరపుటడుగులకు 3 మొక్క లుండాలని సిఫార్సు చేస్తున్నారు. సహజసిద్ధమైన మొక్కల్నే పెంచండి. తలు పులు బార్ల తెరిచివుంచి ఇంట్లో వేడిని సహ జంగానే బయటికి పోయేలా జాగ్రత్త తీసుకోండి. ప్రెస్డ్ పార్టికల్ బోర్డుకంటే అసలైన చక్కే వాడండి.
రంగులు: రంగులన్నిటికీ వేవ్లెంగ్త్ ,శక్తి ఉంటాయి. ఇంట్లో అలంకరణ కోసం సమతూకంతో కూడుకున్న రంగు ల్ని ఎంపిక చేసుకోండి. తేలికైన తెల్లటి లేత పసుపు రంగులు గోడలకు వేస్తే గదిలో ప్రశాంతమై వాతావరణం నెలకొంటుంది.
వాయు ప్రసారం: ఒకవేళ తగినన్ని తలుపులు కిటికీలు లేనట్లయితే ఎక్సాస్ట్ ఫ్యాన్లు వినియోగించి ఇంటిని వెచ్చగా, పొడిగా ఉంచుకోండి. వెంటిలేషన్ లేక వాయు ప్రసారం లేక గాలిమార్పిడి పెంచినట్లయితే ఇంట్లో వేడి తగ్గి బూజుపట్టకుండా ఉండడానికి సహాయపడతుంది. మెత్తటి ఫర్నిషింగ్ సామగ్రి, ఫోముల వంటి సింథటిక్ సామగ్రి వివిధ అనారోగ్యకరమైన గ్యాసులను గాలిలోకి విడుదల చేస్తాయి. వంటగదిలో ప్లాసి్ట కవర్లు, నాన్-స్టిక్ కుక్వేర్ వంటి వస్తువులు వాడకండి. ఫార్మల్డిహైడ్ వుండే రింకిల్ రెసిస్టెంట్ షీట్లు లేక పెస్టిసైడ్ట్రీటెడ్ కాటన్ పడకగదుల్లో వాడినట్లయితే ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది.
సరైన జీవన శైలితో మూత్ర పిండాలు పదిలం
సరైన జీవన శైలితో మూత్ర పిండాలు పదిలం
జీవక్రియ మూలంగా మానవ దేహంలో ఎన్నో మలినాలు వ్యర్ధ పదార్ధాలు తయారవుతాయి. అయితే మూత్రపిండాలు రక్తంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలను మూత్ర రూపంలో బయటకు పంపించడం వలన శరీరంలో లవణాలు, ఖనిజాల సమతుల్యతను, ఆమ్ల క్షార సమతుల్యతను, నీటి శాతాన్ని నియంత్రిస్తాయి. మూత్రపిండాలు శరీరంలోని నీటి శాతాన్ని రక్తపోటును నియంత్రిం చడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, క్రమం తప్పుతున్న ఆహార అలవాట్ల వలన నేడు కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు. మూత్ర పిండాల పనితీరు సరిగా లేకపోవడం వలన శరీరంలో యూరియా క్రియోటినిన్ వంటి పదార్ధాలు పేరుకుపోతాయి.
రక్తంలో ఈ పదార్ధాల స్థాయి ఎక్కువవడం వలన అనేక శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ప్రాణానికే అపాయకరంగా మారవచ్చు. దీనినే ‘రీనల్ ఫెయిల్యూర్’ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్లో మొద టి దశలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. మూత్రపిండాల పనితనం క్షీణించే కొద్దీ లక్షణాలు కనుపిస్తాయి. నీటి సమతుల్యత లోపం, ఎర్ర రక్త కణాల లోపం, శరీరంలో మలినాలు పేరుకుపోవడం వలన వచ్చే లక్షణాలు క్రమంగా మొదలవుతాయి. నీరసం, ఆయాసం, శరీరంలో వాపులు, ముఖ్యంగా కాళ్ళల్లో నీళ్ళు చేరడం లాంటి లక్షణాలు కనుపిస్తాయి. మూత్ర పిండాలకు కలిగే వ్యాధి లక్షణాలు మూత్రం ఆగకుండా జారడం మొదలైనవి. వీటితో పాటుగా నీరసం, బద్ధకం, వాంతులు, కడుపులో తిప్పడం, డయేరి యా, కడుపులో నొప్పి, నోటిలో చేదు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రంగా విఫలమైతే మూర్ఛలు, కోమా వంటివి కూడా సంభవించవచ్చు.ఈ వ్యాధి రాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. హైపర్టెన్షన్, మధుమేహం వంటి వ్యాధులు మూత్ర పిండాలనే కాక శరీరంలోని ఇతర అంగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే రక్తపోటును, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవిత కాలమం తా అప్రమత్తంగా ఉండాలి. మూత్ర పిండాల వైఫల్యానికి అంతర్గతంగా ఉ న్న కారణాలను గుర్తిస్తే తప్ప నిర్ధిష్టంగా చికిత్స చేయరు.
మూత్ర పిండం విఫలమైతే దాని పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడమే లక్ష్యంగా వైద్యులు చికిత్స చేస్తారు. దానిని నిర్లక్ష్యం చేస్తే మూత్ర పిండాలు పూర్తిగా విఫలమవుతాయి.కనుక ఆ పరిస్థితి వచ్చేం దుకు అంతర్గతమైన కారణాలను గుర్తించి వాటికి కూడా చికిత్స చేస్తే మూత్ర పిండాల పనితీరు పూర్తిగా విఫలం కాకుండా చూడడ మే కాదు కొన్నిసార్లు దాని పని తీరును మెరు గు పరచవచ్చు. మూత్ర పిం డ వ్యాధిగ్రస్థు లు ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించా లి. నిపుణులను అడిగి తెలుసుకోవాలి. వ్యాధి బారిన పడిన కిడ్నీలు అధిక నీటిని, ఉప్పును లేదా పొటాషియంను తేలికగా తొలగించలే వు కనుక తక్కువగా తీసుకోవాలి. అంతర్గత కారణాలు కనుగొన్న తరువాత ఫాస్ఫరస్ను తగ్గిం చే మందులను, ఎర్ర రక్త కణాలను ఉత్తేజితం చేసి, పెంచేందుకు, రక్తపోటుకు మందులిస్తారు. ఒకవేళ మూత్రపిండాలు పూర్తిగా విఫలమైతే వైద్యులు డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఆధారపడవలసి ఉంటుంది.
Surya Telugu Daily
-
భాండాగారం
- జనవరి 2020 (13)
- జూన్ 2018 (1)
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS