హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

కథాశిల్పి …డాక్టర్‌ కాకాని చక్రపాణి

కథాశిల్పి

Chakrapani-f-కథలు రాయటం తేలికా కష్టమా అనే మీమాంస వచ్చిన ప్పుడు రెండు విధాలగానూ అభిప్రాయం వ్యక్తం చేస్తారు రచయితలు. అసలు కథకంటే నవల రాయటమే బహు తేలిక అనే వాళ్ళూ వున్నారు.డాక్టర్‌ కాకాని చక్రపాణి ప్రముఖ రచయిత. ఆయన కథలూ, నవలలూ కూడా బహు తేలిగ్గా రాయగలిగాడు.ఆయన రచనలు ఎందరో సాహితీ విమర్శకుల దృష్టికి వెళ్ళి మెప్పులు పొందటమే గాకుండా వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహిం చిన పోటీలలో బహుమతులూ పొం దినయి.

కథను సంఘటన చుట్టూ తిప్పు తూ, పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ చెప్పదలుచుకున్న విషయాన్ని లోతు గా పరిశీలించి పాఠకుడిని ఆలోచిం ప చేయగలిగిన రచనలు చేయటం ఆయన నేర్చుకున్న విద్య.చక్రపాణి కథనంలో ఒక ఒడుపు, ఒక చాతుర్యమూ, భావుకత్వంతో కూడిన ఒక వేగమూ కన్పిస్తాయి. ఆత్మవిశ్వాసమూ, సంస్కారపూరిత ధి క్కార స్వభావమూ ఉండే స్త్రీ పాత్ర చిత్రణ ఆయన రచనల్లో కనిపి స్తుంది. సాహిత్య సామాజికాంశాల ప్రత్యేకతే కాకుండా, చాలామంది కథా రచయితల్లో కన్పించని కంఠస్వర వైవిధ్యం చక్రపాణి కథల్లో కన్పిస్తుంది.

ప్రతి రచయితకూ క్షణక్షణం కవ్వించే జీవితమే అంతులేని ఆకర్ష ణ. తన ఒక్కొక్క రచన ద్వారా ఆకాశమంత ప్రహేళికలో ఖాళీ స్థానాలను పూర్తి చేసుకుంటూ పోయే రచయిత తన ఊహల పిడికిలికి అంది నంత మేర ఆకారం, అర్థం ఇస్తాడు. అటు వంటి నిత్యార్యార్థకం అవ తారాలే చక్రపాణి కథలు. వీటినిండా మనకు తెలిసిన వ్యక్తులే ఉంటా రు. తెలిసిన చీకటి వెలుగులే ఉంటయి.వీరి కథలు చాలామంది పాఠకులని ఆకర్షిస్తాయి అనటంలో అతి శయోక్తి లేదు. డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి, వాకాటి పాండురంగారా వు, మునిపల్లె రాజులాంటి ప్రముఖ రచయితలు కూడా ఆయన కథలంటే ఆసక్తి చూపిస్తారు.

కాకాని మూడు కథా సంపుటాలను ప్రచురించారు. అవి థ్రిల్లిం త, నివురు, పతితపావని. అందులో ఒకదానికి డాక్టర్‌ కేతు విశ్వనా థరెడ్డి ముందుమాట రాస్తూ ‘చిత్తవృత్తుల్ని ఆడించే శక్తుల్ని ఈ రచ యిత తన కథల్లో ఒక అన్వేషకుడిగా పట్టుకో డానికి ప్రయత్నించా డు. మనిషిని మనిషిగా, ఒక సామాజిక సాంస్కృతిక మూర్త పదా ర్థంగా పరిశీలించాడు. మనుష్యులు కోల్పోతున్న ఆపేక్షలను గుర్తిం చాడు. పోగొట్టుకుంటున్న విలువల్ని చర్చించాడు’ అంటారు.అసలు మనిషికి స్వేచ్ఛ వున్నదా, వుంటే ఆ మేరకు ఏ వ్యక్తి అయి నా జీవించగలడా, ఆ గీతలు గీచే సమాజ ప్రభావం ఎలాం టిది అన్న అతి గహనమైన విషయాన్ని చక్కటి శిల్పంతో దిద్దిన కథ ‘నిస్వార్థం’. మెరుపు తీగలాటి వివేకవతి అయిన భార్య వుండి కూడా వీధుల వెంబడి కుక్కల్లాగా తిరిగే భర్తను, సంయమనం నిండిన ఛీత్కారంతో చిత్రించింది ‘చుక్కల్లో చంద్రుడు’ కథ.

‘మరమరాలు బఠాణీలు అందులో సామ్యవాదం’లోని నారా యణరావు, ‘రెండు ముఖాల చంద్రుడు’లోని రామచంద్రం, ‘మహా పర్వతంా మరుగుజ్జు’లోని రామం నేటి కాలంలోని పురుషకు సం స్కారానికి ప్రతినిధులు.స్త్రీ పురుష సంబంధాలను వేర్వేరు కోణాలనుండి ‘భార్యంటే’, ‘తాకట్టు’, ‘ఛీ! ఏం మగాడు’ కథలు పరిశీలించగా ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ మనసుకు శరీరానికి మధ్యగల శక్తివంతమైన సం బంధాన్ని చిత్రీకరిస్తుంది.

ఆయన రచనలో వ్యక్తీకరించిన కొన్ని యదార్థ వాదాలు ఇలా వుం టాయి. ఆడది చాలా విషయాల్లో మగవాడిని పల్టీ కొట్టిటస్తుంది. అటు వంటిది అందమైన స్త్రీ ముందు నిలబడ్డ మగవాడు మరింత బిడియ స్తుడవుతాడు. పిచ్చిమొక్కలు కోసినంత తేలిగ్గా గులాబీలను త్రుంచ డానికి మనవేళ్ళు మనకు సహకరించవు గనుక మగవాడు ఆడదాన్ని మహా పర్వతం చేసి తను మరగుజ్జు అవుతున్నాడు. అలా గే, మరో చోట చంద్రుడిలోని నల్లని మచ్చను కుందేలులా ఊహిం చుకునే మనస్సు మనది అంటాడు.‘దయ్యం వదిలింది’ లో కథనం ఇలా నడుస్తుంది ’ఆయన రాసిన కథలు వయసొచ్చిన ఆడపిల్లల్లాం టివి. వాటిని గుండెల మీద కుంపట్లలా భరించేవాడు ఆయన. తల్లి దండ్రులు కూతురికి వీలయినంత మంచి సంబం తధమే చేయాలని చూస్తారు. అలాగే మా బావగారికి తన కథలు మంచి పత్రికలలో రావాలని వుండేది’ అంటుంది అందులోని ఒక పాత్ర.

చక్రపాణికి కథలు రాయటమే కాకుండా, ఇతర భాషా రచనలను తెలుగులోకి, తెలుగులోని మంచి రచనలను ఆంగ్లం లో కి అనువదించటం, మిత్రులతో కలిసి మాటలు చెప్పటం తృప్తినిచ్చే పనులు. ఆయన మాట్లాడుతుంటే మనకూ కాలం తెలియదు.ఆరవై అయిదేళ్ళ క్రితం మాట. ఇప్పుడా దృశ్యానికి ఎన్ని మార్పు లూ, చేర్పులూ వచ్చాయో తెలియదు. గుంటూరు జిల్లా, మంగళ గిరి మండలలో చినకాకాని గ్రామంలో జన్మించాడు కాకాని చక్ర పాణి. తరువాత ప్రముఖ రచయిత అయి, కథలూ నవలలూ వ్రాసి, సవ్యసాచిలా తెలుగులోనూ, ఇంగ్లీషూలోనూ రచనలు చేస్తూ సాహిత్యంలో డాక్టర్‌ ఆవ్వటమే గాకుండా తెలుగులో ఎంతోమంది సాహితీ ప్రియులకు సన్నిహితుడయ్యాడు.

కష్టాలు లేందే సుఖంలోని మజా తెలియదంటారు. అనారోగ్యం వలన బిఎస్సీ చదువును అర్ధాంతరంగా ఆపేసినా, తరువాత ఉద్యో గం చేస్తూ, సంసారమనే సాగరాన్ని ఈదుతూ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ లోను, ప్రాచీన భారత దేశ చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంలో ను ఏం.ఏ.పట్టా పుచ్చుకొని, ‘తెలుగు సాహిత్యంపై సోమర్‌ సెట్‌మామ్‌ ప్రభావం’ అన్న విషయం మీద పరిశోధనాత్మక వ్యాసం తో డాక్టర య్యాడంటే ఆయనలోని పట్టుదలా, ఆత్మవిశ్వా సాలు ఎలాంటివో తెలుస్తుంది. ఆ పరిశోధనలో భాగంగానే, సోమ ర్‌సెట్‌ మామ్‌ మాగ్నం ఓపస్‌ నవల ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’ ను తెలుగు లోకి అనువదించాడు.ఆయన చేసిన ఆ పని తెలుగు సాహిత్యాన్ని మరింత సు సంపన్నం చేసిందనటంలో నిస్సందేహం.

కాకాని చక్రపాణి హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా ముప్పయి సంవత్సరాల కు పైగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు.ఆయన రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అల్ప జీవి నాలుగు తెలుగు ప్రముఖ నవలలను ఆంగ్లంలోకి అనువదిం చగా, వాటిని కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం ‘ఫోర్‌ క్లాసిక్స్‌ ఆఫ్‌ తెలుగు ఫిక్షన్‌’ అన్న పేరుతో పుస్తకరూపంలోకి తీసుకు వచ్చిం ది. వీరు రాసిన పెక్కు కథలకు వివిధ పత్రికల నుండి బహుమతులు రావటమే గాకుండా, వీరి ‘సాహిత్య ప్రభావం’ గ్రంథం విమర్శా ప్రక్రి యకు 2009లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని పొం దింది. మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదు టివారిని నొప్పించని తత్వం.

ఆయన 60 దాకా తెలుగులో కథలు, పదకొండు నవలలు వ్రాశా రు. దాదాపు పది సంవత్సరాలు ఆంధ్రభూమి దినపత్రికలో వారం వారం ‘కధలు కాకరకాయలు’ అనే శీర్షికతో పెక్కు రాజకీయ సామా జిక విషయాలపై సున్నితమైన హాస్యంతో వ్యంగ్య బాణాలు విసిరారు.1989లో కేంద్ర సాహిత్య అకాడమి నిర్వహించిన పదిరోజుల గోష్టి కార్యక్రమంలో ఆహ్వానితుడుగా పాల్గొన్నారు. ఆయన ప్రచు రించిన ‘భారతీయ సాహిత్యం సమ కాలీని కథలు’ పుస్తకంలో వివిధ భాషలనుండి అనువదించిన కథలు ప్రచురితమయ్యాయి.

డాక్టర్‌ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి, డాక్టర్‌ గోవిందరాజు చక్ర ధర్‌, జి.వెంకటరాజం వంటివారితో కలిసి చాలా పుస్తకాలను ఆంగ్ల నుండి తెలు గులోకి అనువదించి పుస్తక రూపం లో ప్రచురించారు. అందులో ముఖ్య మయినవి స్వామి రంగనాధానంద ఆధ్యాత్మిక వ్యాసాలను ‘పరిపూర్ణ సా ఫల్యానికి ప్రజాస్వామ్యం’. మామ్‌ వ్రాసిన ‘క్రిస్ట మస్‌ హాలీడే’ ను ‘యవ్వనపు దారిలో’గా, సరోజినీ రేగాని ‘నిజాం బ్రిటిష్‌ రిలేషన్స్‌’ను ‘నిజాం బ్రటిష్‌ సంబంధాలు’గా, పి.వి.పరబ్రహ్మం ‘కాకతీయ ఆఫ్‌ వరంగల్‌’ను ‘కాకతీ యులు’గా, కీ.శ 624 నుండి 1000 వరకు తొలి మధ్య యుగ ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర సమీకృతిగాను, రాబర్ట్‌ స్యూయల్‌ ‘ఫర ్‌గాటెన్‌ ఎంపైర్‌ (విజయనగర)’ ను ‘విస్మృత సామ్రాజ్యం విజయ నగరం’ అన్న పేరుతోనూ అనువదించారు.

ఇవిగాక హిందీనుంచి ‘అభయ మౌర్యా యుగనాయక’ను, ఇతర భాషలనుంచి మరో ఇరవై ఆయి దు కథలను ఆంగ్లంలోకి అనువదించారు.ఆయనకు మామ్‌ కథలంటే చాలా ఇష్టం. మామ్‌ ‘మనిషి తను సుఖంగా బతకాలంటే ప్రథమంగా అవసరమైనది మానవుల అని వార్య స్వార్థపరత్వాన్ని గుర్తించటం.ఇతరులు నీ కోర్కె తీర్చటం కో సం తమ కోర్కెలు త్యాగం చేయాలనటం మహా అసంగత మైన పని.నువ్వు ఇతరులను స్వార్థరహితంగా వుండమని అడు గుతు న్నావు.

వాళ్ళలా ఎందుకుండాలి? ప్రతి వ్యక్తీ తన కొరకే అనే నిజం తో నువ్వు రాజీ పడనప్పుడు, నీ చుట్టూ వున్న వాళ్ళ నుంచి నువ్వడి గేది అతిస్వల్పం. వాళ్ళు నిన్ను నిరాశ పర్చరు. వాళ్ళను మరింత స ద్భావంతో పరికిస్తావు.’ అంటాడు.చక్రపాణి కూడా ఆ భావ నలను నమ్ముతాడనే విషయం ఆయన రచనలే చెబుతాయి.ఆయన రచనలో నిత్యయవ్వనుడు. ఆ యవ్వనాన్ని అలాగే నిలు పుకుంటూ ఇంకా ఇంకా నవలలు, కథలూ వ్రాయాలని, తెలు గు సాహితీ సంపదను ఇతర భాషీయులకు అంది వచ్చేలా తీసుకు రావాలని కోరుకుందాం.

 

Surya Telugu Daily

డిసెంబర్ 22, 2010 - Posted by | సంస్కృతి

1 వ్యాఖ్య »

  1. You gave a lot of valuable information on Kaakani Chakrapani. Thanks alot.

    వ్యాఖ్య ద్వారా Dr.LRGoje | డిసెంబర్ 22, 2010 | స్పందించండి


వ్యాఖ్యానించండి