జీవ వైవిధ్యానికి నెలవు.. నాగర్హోల్ జాతీయవనం
జీవ వైవిధ్యానికి నెలవు.. నాగర్హోల్ జాతీయవనం

రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ గా పేరొందిన నాగరోహోల్ నేషనల్ పార్క్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్. కర్నాటకలోని మైసూర్ నగరానికి 94 కిమీల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం కొడగు జిల్లా నుండి మైసూర్ జిల్లా వరకు వ్యాపించి ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్కి వాయువ్యంగా ఉన్న నాగరోహోల్ నేషనల్ పార్క్కి బందీపూర్ నేషనల్ పార్క్కి మధ్యనున్న కబినీ రిజర్వాయర్ ఈ రెండు పార్కులనీ విడదీస్తుంది. మాజీ మైసూర్ పాలకులు దీనిని ప్రత్యేకమైన హంటింగ్ రిజర్వ్ (పరిరక్షించబడిన వేట ప్రాంతం) గా ఉపయోగించేవారు. దట్టమైన చెట్లతో కప్పబడిన ఈ అటవీ ప్రాంతంలో చిన్న వాగులూ, లోయలూ, జలపాతాలూ దర్శనమిస్తాయి. కర్నాటక రాష్ట్రంలోని వన్యప్రాణులను సంరక్షిస్తోన్న ఈ పార్క్ 643 చకిమీ మేర వ్యాపించి ఉన్నది. బందీపూర్ నేషనల్ పార్క్ 870 చకిమీ, మదుమలై నేషనల్ పార్క్ 320 చకిమీ. వాయనాడ్ వైల్డ్లైఫ్ శాంక్చురీ 344 చకిమీ తో కలిపి మొత్తం 2183 చకిమీ మేర వ్యాపించి ఉన్న ఈ స్థలం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ స్థలం.
‘నాగ’ అంటే ‘పాము’, ‘హొలె’ అంటే ‘వాగు’ అన్న రెండు పదాల నుండి నాగరోహోల్ అన్న పదం పుట్టింది. 1955లో స్థాపించబడిన ఈ పార్క్ దేశంలో అత్యుత్తమంగా నిర్వహించబడుతోన్న పార్కులలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడి వాతావరణం ఉష్ణంగా ఉండి, వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాఘ్ర-క్రూరమృగాలు సరైన నిష్పత్తి ఉన్న ఈ పార్క్లో బందిపూర్ కంటే పులి, అడవిదున్న, ఏనుగుల జనాభా అధికంగా ఉంటుంది. నీలగిరి బయోస్ఫియర్ (జీవావరణము) రిజర్వ్లో ఈ పార్క్ ఒక భాగం. పడమటి కనుమలు, నీలగిరి సబ్ క్లస్టర్ (6,000 చకిమీ), నాగరోహోల్ నేషనల్ పార్క్ – ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదం పొందడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ పరిగణనలో ఉన్నాయి.
విశాల వనం…
ఈ అడవి వెస్టర్న్ ఘాట్స్ పర్వత పాదం నుండి కొండ వైపు… అలాగే దక్షిణం వైపు కేరళ వరకు వ్యాపించి ఉన్నది. ఈ అడవి వృక్షసంపద గురించి చెప్పాలంటే దక్షిణ భాగాన తేమతో కూడిన డెసిడ్యూస్ (కాలానుగునంగా ఆకులు రాల్చు) అడవి (టెక్టోనా గ్రాండిస్, డల్బెర్జియా లాటిఫోరియా), తూర్పు భాగాన, పొడిగా ఉండే ఉష్ణారణ్యం (రైటియా టింక్టోరియా, అకేషియా), ఉపపర్వత లోయలో బురదతో కూడిన అడవి (యూజనియా) ఉన్నాయి. ఎర్రకలప, టేకు, గంధం, సిల్వర్ ఓక్ ఈ ప్రాంతంలో ముఖ్యమైన వృక్షసంపద. బందీపూర్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న దక్షిణ భాగాలు సాధారణంగా వాయువ్య భాగాల కంటే పొడిగా ఉంటాయి.
జంతు, వృక్షజాలం…
నాగర్హోల్లో ఏనుగుల జనాభా ఎక్కువ. పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు అధికంగా కనిపిస్తాయి. అడవిదున్న, సాంబార్ జింక, చీతల్ (మచ్చలున్న జింక), కామన్ మున్జాక్ జింక, నాలుగు కొమ్ముల జింక, మౌజ్ జింక, వైల్డ్ బోర్ (అడవి పంది) లాంటి గిట్టలున్న జంతువుల మీద పెద్ద క్రూరమృగాలు ఆహారం కోసం ఆధారపడతాయి. గ్రే లంగూర్స్, లయన్ టేల్డ్ మకాక్స్, బోన్నెట్ మకాక్స్ ఈ పార్క్లోని ఆదిమ జాతులుగా చెప్పవచ్చు. పార్క్ బయట, చుట్టూ వ్యాపించి ఉన్న కొండలలో నీలగిరి టార్స్, నీలగిరి లంగూర్స్ కనపడతాయి. దక్షిణ భాగాన ఉండే ఉష్ణం, తేమతో కూడిన మిశ్రమమైన డెసిడ్యూస్ అడవుల నుండి, తూర్పు భాగాన ఉండే బురద కూడిన కొండ లోయ అడవుల వరకు చాలా భిన్నంగా ఉంటాయి.
పొడిగా ఉండే డెసిడ్యూస్ అడవిలో టేర్మినాలియా టర్మెన్టోసా, టెక్టోనా గ్రాండిస్, లాజస్ట్రోమియా లాన్సివొలాటా, టేరోకార్పస్ మార్సపియం, గ్రూవియా తిలేఫోలియా, దళ్బెర్జియా లాతిఫోరియా మరియు ఎంజీసుస్ లాతిఫోరియా మొదలగు వృక్ష జాతులతో కూడిన వృక్షసంపద ఉన్నది. ఇతర వృక్ష జాతులలో లాజస్ట్రోమియా మైక్రోకార్పా, అదీనా కొర్డిఫోలియా, బొంబాక్స్ మలబార్సియం, స్క్లీషేరా ట్రైజూగా, ఫైకస్ జాతికి చెందినా వృక్షాలు కనిపిస్తాయి. పొదలు, మొక్కలు, పొదలలో పెరుగుతూ కనపడే జాతులు – కైడియా కాలిసినా, ఎంబికా అఫీషినాలిస్ మరియు గ్మేలీనార్బోరియా. సోలానం, డేస్మోడియం, హెలిక్టర్స్ అతిగా వృద్ది చెందు లాంటానా కామరా, యూపటోరియం లాంటి పొదలు అధికంగా కనిపిస్తాయి. బురదతో కూడిన అడవి భాగంలో యూజనియా అధికంగా కనిపిస్తే, తేమతో కూడిన డెసిడ్యూస్ అడవుల్లో సాధారణంగా కనపడే ఎనోజీసస్ లాటిఫోరియా, కాసియా ఫిస్ట్యూలా, బూటియా మోనోస్పెర్మా, డెన్డ్రోకాలమస్ స్ట్రిక్టస్, రైటియా టింక్టోరియా, అకేషియా , లాంటి వృక్ష జాతులు పొడిగా ఉండే డెసిడ్యూస్ అడవుల్లో కూడా కనపడతాయి. ఎర్రకలప, టేకు వృక్షాలే కాక, వాణిజ్యపరంగా ముఖ్యమైన వృక్ష జాతులు, గంధం, సిల్వర్ ఓక్ కూడా కనపడతాయి.
అతి ముఖ్యమైన జాతులైన పులి, ఇండియన్ బైసన్ లేదా గౌర్ (అడవి దున్న), ఏషియన్ ఏనుగులు చాలా పెద్ద మోతాదులో పార్క్ లోపల కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్ కాన్సర్వేషన్ సొసైటీకి చెందిన ఉల్హాస్ కారంత్ నాగరోహోల్ అడవుల్లో చేసిన అధ్యయనం ప్రకారం… ఆసక్తికరంగా, వేటాడే జాతులకి చెందిన జంతువులు పులి, చిరుత అడవికుక్కలు సమతుల్యమైన సాంద్రత కలిగి ఉన్నాయని తేలింది. ఈ పార్క్లో తోడేళ్ళు, బూడిద రంగు ముంగిస, ఎలుగుబంట్లు, చారల సివంగి, మచ్చల జింక లేదా చీతల్, సామ్బర్ జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల జింక , అడివి పందులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇతర క్షీరదాలైన కామన్ ఫాం సివెట (పునుగు పిల్లి జాతి), బ్రౌన్ మాన్గూస్, స్ట్రైప్డ్ నెక్డ్ మాంగూస్ (ముంగిస జాతి), బ్లాక్ నేప్డ్ హేర్ (చెవుల పిల్లి లేదా కుందేలు జాతి), ఇండీన్ పాంగోలిస్ (పొలుసులతో కూడిన చీమలు తిను జంతువు), రెడ్ జైంట్ ఫ్లాఇంగ్ స్క్విరల్ (ఉడుత జాతి), ఇండియన్ పోర్సుపైన్ (ముళ్ళ పంది జాతి), ఇండియన్ జెయింట్ ఫ్లైయింగ్ స్క్వారెల్ (ఉడుత జాతి) వంటి వివిధ జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.
పక్షి విహంగానికి అనువైన కేంద్రం…
ముఖ్యమైన విహంగ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్క్లో 270 జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి. వీటలో శీఘ్రంగా అంతరించిపోతున్న జాతులకి చెందిన ఓరియంటల్ వైట్ బాక్డ్ వల్చర్ (రాబందు జాతి), వల్నరబుల్ లెస్సర్ అడ్జూటంట్ (బెగ్గురు కొంగ జాతి), గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ (గద్ద జాతి), నీలగిరి వుడ్ పిజియన్ (పావురం జాతి) వంటి పక్షులు ఉన్నాయి. దాదాపుగా ఆపదకి గురయ్యే జాతుల్లో డార్టర్స్ (కొంగ జాతి), ఓరియంటల్ వైట్ ఐబిస్ (కొంగ జాతి), గ్రేటర్ గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ (గద్ద జాతి), రెడ్ హెడెడ్ వల్చర (రాబందు జాతి) వంటి పక్షులు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. స్థల విశిష్టమైన జాతుల్లో బ్లూ వింగ్డ్ పారాకీట్ (చిలుక జాతి), మలబార్ గ్రే హార్న్ బిల్ (వడ్రంగి పిట్ట జాతి), వైట్ బెల్లీడ్ ట్రీపై (కాకిజాతి) వంటి ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇక్కడ కనపడే కొన్ని పక్షుల్లో వైట్ చీక్డ్ బార్బెట్, ఇండియన్ స్కైమైటార్ బాబ్లర్ ఉన్నాయి. పొడి ప్రదేశాలలో సాధారణం గా కనపడే పేయింటెడ్ బుష్ క్వైల్ (కొలంకి పిట్ట), సర్కీర్ మల్ఖొవా, ఆషి ప్రైనియా (పిచ్చుక జాతి), ఇండియన్ రాబిన్ (పాలపిట్ట జాతి), ఇండియన్ పీఫౌల్ (నెమలి జాతి) యెల్లో లెగ్డ్ గ్రీన్ పిజియన్ (పావురం జాతి) లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.
రకరాకాల పాములు…
సాధారణంగా కనపడే సరీసృపాలలో వైన్ స్నేక్, కామన్ వుల్ఫ్ స్నేక్, రాట్ స్నేక్, బాంబూ పిట్ వైపర్, రసెల్స్ వైపర్ (సెంజెర జాతి), కామన్ క్రైట్ (కట్లపాము జాతి), ఇండియన్ రాక్ పైథాన్ (కొండ చిలువ జాతి), ఈందియన్ మానిటర్ లిజార్డ్, కామన్ టోడ్… ఇక్కడ కనపించే పాము జాతులు. బెంగళూరుకి చెందిన ‘అశోకా ట్రస్ట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఇకాలజి అండ్ ది ఎన్వైరన్మెంట్’ కి చెందిన పరిశోధకులు ఈ ప్రాంతంలోని కీటకాల జనాభాకు సంబంధించిన బయొడైవర్సిటీ (జీవ భిన్నత్వం) పై విస్తృతమైన అధ్యయనాలు చేశారు. ఈ పార్క్లో కీటక జీవ భిన్నత్వంలో 96 జాతులకు చెందిన డంగ్ బీటిల్స్ ( పేడపురుగులు) 60 జాతులకు చెందిన చీమలు కూడా ఉన్నాయి. అసాధారణ జాతులుగా గుర్తించిన చీమలో హార్పెగ్నథొస్ సాల్టేటర్ అనబడే, ఎగిరే చీమలను గుర్తించారు. ఇవి ఒక మీటరు యెత్తున ఎగరగలవు. టెట్రాపోనేరా రూఫోనిగ్ర జాతికి చెందిన చీమలు అడవికి ఆరోగ్యసూచకంగా ఉపయొగపడవచ్చు, ఎందుకంటే… ఇవి చెదపురుగులని తిని బ్రతుకుతాయి. చచ్చిన చెట్లు ఉండే ప్రాంతాలలో ఇవి పుష్కలంగా కనిపిస్తా యి. ఏనుగు పేడ మీద మాత్రమే బ్రతికే హీలియోకొప్రిస్ డొమి నస్, ఇండియాలోని అతిపెద్ద పేడపురుగు (ఆం థొఫేగస్ డామా) కామన్ డంగ్ బీటిల్, చాలా అరుదుగా కని పించే ఆంథొఫేగస్ పాక్టోలస్ కూడా ఇక్కడి పేడ పురుగుల జాతు ల్లో ఉన్నాయి.
హాయి… హాయిగా సఫారీ యాత్ర…
బెంగళూరుకి సుమారు 220 కి.మీ. దూరంలో ఉన్న ముర్కల్ అతిధి గృహాలలో పర్యాటకులకు అటవీశాఖ విడిది ఏర్పాటు చేసింది. పార్క్లోని కార్యాలయం దగ్గర కూడా వసతి ఉన్నది. అటవీశాఖకు చెందిన వాహనాలలో రోజుకి రెండుసార్లు, అంటే వేకువఝామున, సాయం సమయంలో సఫారి యాత్ర ఏర్పాటుచేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం తరచూ విద్యా శిబిరాలు నిర్వహిస్తారు. ఇంకా అటవీశాఖ పాఠశాల విద్యార్థుల పర్యటన కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుండడం విశేషం. అయితే జంతువుల కలయిక కాలంలో, వర్షాకాలంలో సఫారి యాత్రలు లేకుండా పార్క్ని మూసివేస్తారు. ట్రాఫిక్ కదలికలను ప్రొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టడి చేసి అడవికి ఇరువైపులా ఉండే గేట్లని మూసివేస్తారు.
ఏకశిలా విగ్రహాతోరణం.. ఉండవల్లి గుహలు
ఏకశిలా విగ్రహాతోరణం.. ఉండవల్లి గుహలు
ఆంధ్రప్రదేశ్లో చూడదగ్గ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఓ పెద్ద కొండను తొలిచి లోపల గదులుగా నిర్మించిన ఆనాటి శిల్పుల శిల్పాకళా నైపుణ్యానికి ఉండవల్లి గుహలు సజీవ సాక్షాలు. కొండకు ముఖ ద్వారాన్ని ఏర్పరచి అందులోంచి లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ చెక్కబడి ఉన్న వివిధ రకాలైన దేవతామూర్తులు, శిల్పాలు ఈ ఉండవల్లి గుహల ప్రత్యేకత.
గుహలోని విశేషాలు ..
బయటినుంచి చూస్తే కొండముందు కట్టబడిన ఓ రాతి భవనం లాంటి నిర్మాణంగా కనిపించినా… లోపలికి వెళితే ఓ అద్భుతలోకం ఆవిష్కరించబడుతుంది. గుహ లోపల నాలుగు అంతస్థులుగా తొలచి అందు లో దేవతా విగ్రహాలతోపాటు వివిధ రకాల శిల్పాలు చెక్క బడి ఉన్నాయి. అలాగే కొండకు వెలుపలి భాగంలో తపోవనంలో ఉన్న మహ ర్షులను పోలి న విగ్రహాలు కన్పిస్తాయి. గుహ లోపల శయనించి ఉన్న అతిపెద్ద మహా విష్ణు వు (అనంత పద్మనాభస్వామి) విగ్రహం పర్యాటకులను విశే షంగా ఆకర్షిస్తుంది.
అతిపెద్ద గ్రానైట్ రాయిపై చెక్కబడిన ఈ వి గ్రహంతోపాటు ఇతర దేవతల విగ్రహాలు సె ైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఇతర ఆలయాల్లో త్రి మూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవ తలకు ఉద్దేశించినవి. గుహాంత ర్బాగంలో కమలంలో కూర్చున్న బ్రహ్మ, సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రధమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తు న్న ఆధారాలలో ఒ టి. పర్వతము బ యటి వైపు గుహాలయ పైభా గంలో సప్తఋషు ల వి గ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతా న్ని గుహలుగానూ దేవ తా ప్రతిమలతో పాటు ఏకశిలా నిర్మితంగా ని ర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూే స్తనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రురాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి. ఈ గుహల నిర్మాణశైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూ పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహలను క్రీశ 430 ప్రాంతంలో పాలించిన విష్ణుకుండుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు పేర్కొంటారు.
ఇతర విశేషాలు…
ఇది పల్లెటూరు కావడం వల్ల ఇక్కడ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఉండవల్లి గ్రామానికి సమీపంలో ఉండే ఇతర ప్రాంతాల గురించి చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ప్రకాశం బ్యారేజీ పైన బస్సు సదుపాయం లేదు. అలాగే విజయవాడ కూడా ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంది. మంగళగిరికి 5 కిమీల దూరంలో, అమరావతి సైతం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది.
గిన్నీస్ రికార్డులో ‘కూచిపూడి ’…
గిన్నీస్ రికార్డులో ‘కూచిపూడి ’…
ఒకరా ఇద్దరా ఏకంగా 2,800మంది ఒకేసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. లయబద్ధమైన సంగీతం మధ్య గురువులు, కళాకారులు కలిసి నిర్వహించిన నృత్య ప్రదర్శన సందర్శకులను అబ్బురపరిచింది.ఇంతమంది కూచిపూడి నృత్యకారులు ఒకేసారి నిర్వహించిన నృత్య ప్రదర్శన ఏకంగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. వీరి నృత్యాభినయం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేసింది.సిలికానాంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ‘అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం’లో భాగంగా ఈ అద్భుతమైన రికార్డు చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమ్మేళనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ సమ్మేళనానికి హాజరైన కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రత్యేకంగా కూచిపూడి నృత్యం చేయడం విశేషం.
తెలుగువారి సంప్రదాయ నృత్యం కూచిపూడి. ఈ సంప్రదాయ నృత్యం కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించింది. ముందుగా కూచిపూడి గ్రామంలోని బ్రాహ్మణులు ఈ నృత్యాన్ని నేర్చుకొని ప్రదర్శనలిచ్చేవారు.కాల క్రమేణా ఈ నృత్యానికి దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రఖ్యాతులు లభించాయి. కర్నాటక సంగీతం మధ్య చక్కటి నృత్యాభిన యంతో నిర్వహించే కూచిపూడి నృత్యం నయనమనోహరంగా ఉంటుందని కళాప్రియులు పేర్కొంటారు. వయోలిన్, ఫ్లూట్, తంబూరాల సంగీతం మధ్య ఈ నృత్య ప్రదర్శన మైమరపిస్తుందని వారు చెబుతారు.
కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపు…
దేశంలో ప్రసిద్దిగాంచిన కూచిపూడి నృత్యం నేడు విదేశాల్లో సైతం క్రమ, క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ అందమైన నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకు సిలికానాంధ్ర చేసిన ప్రయత్నం అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనంతో ఫలించింది. ఈనెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల వరకు ఈ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం హైదరాబాద్లోని నోవాటెల్ హెచ్ఐసిసిలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమె రికా న్యూజెర్సీకి చెందిన సిద్దేంధ్ర కూచిపూడి అకాడమీ నాట్యగురువు స్వాతి గుండపనిడి ఆధ్వర్యంలో అదేరోజు రవీంద్రభారతిలో నిర్వహించిన కూచి పూడి నృత్య ప్రదర్శన సందర్శకులకు మధురానుభూతులను పంచింది. ఇక మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనంలో మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు నృత్యగురువులు, నృత్య కారులు పాల్గొన్నారు.
గిన్నీస్ రికార్డు…
తెలుగువారి సొంతమైన కూచిపూడి నృత్యానికి గిన్నీస్ బుక్లో చోటుకల్పిం చేందుకు సిలికానాంధ్ర చేసిన కృషి సఫలీకృతమైంది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని గచ్చీబౌలిలో ఉన్న జిఎంసి.బాలయోగి స్టేడి యంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ ప్రయత్నానికి వేదికగా మారింది. ఒకేసారి 2,800మంది కూచిపూడి నృత్యకారులు లయబద్దంగా నృత్యం చేసి కూచిపూడికి గిన్నీస్ బుక్లో చోటుకల్పించారు. ఐదు నుంచి అరవై సంవత్సరాల వయస్సున్న నృత్యకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో మనదేశంతో పాటు 16 దేశాల నృత్యకారులు పాల్నొడం విశేషం.
గురువుల బృందం, శిష్య బృందంతో కలిసి నిర్విహంచిన కూచిపూడి నృత్యం నయనమనోహరంగా కొనసాగింది. హిందోళ రాగంలో సాగిన తిల్లా న నృత్య రూపకానికి పద్మభూషణ్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వం వహించారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమం త్రి కిరణ్కుమార్రెడ్డి సమక్షంలో ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కార్యక్రమంలో సిలికానాంధ్రకు గిన్నీస్ రికార్డు పత్రాన్ని అందజేశారు.
‘తెలుగువారి నృత్యమైన కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకే అంతర్జాతీయ కూచిపూడి సమ్మే ళనాన్ని నిర్వహించాము. ఇందులో భాగంగానే 2,800మంది నృత్యకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఈ అరుదైన ప్రదర్శనతో కూచిపూడికి గిన్నీస్బుక్ రికార్డులో చోటుదక్కింది. తెలుగువారి కళలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకు సిలికానాంధ్ర కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది హైదరాబాద్లో లక్షగళార్చన కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కాము’ అని ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబోట్ల ఆనంద్ అన్నారు.
ఆకట్టుకున్న రాజారాధారెడ్డి శిష్యబృందం ప్రదర్శన…
అంతర్జాతీయ కూచిపూడి నృత్యసమ్మేళనంలో భాగంగా చివరిరోజున రాజా రాధారెడ్డి శిష్య బృందం నిర్వహించిన నృత్యప్రదర్శన కళాప్రియులను ఎంత గానో ఆకట్టుకుంది. వారి దేవీస్తుతి నృత్యరూపకం కనువిందుచేసింది. ఈ బృందం ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్లో ప్రదర్శించిన నృత్యం లేజర్ లైటింగ్లో అద్భుతంగా కొనసాగింది. ఈ ప్రదర్శనను తిలకించిన సందర్శకుల కరతాళ ధ్వనులతో జిఎంసి బాలయోగి స్టేడియం మారుమ్రోగింది.
-
భాండాగారం
- జనవరి 2020 (13)
- జూన్ 2018 (1)
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS